ఇసుక డంపును.. సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 ట్రిప్పుల ఇసుక డంపులను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ తెలిపారు. ఈ మేరకు తహసిల్దార్ దిలీప్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలంలోని ఆకునూర్ గ్రామ పరిధిలో గల కొత్త దొమ్మట క్రాస్ రోడ్డుకు దగ్గరలో సుమారుగా 12 ట్రిప్పుల ఇసుక డంపును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. ఇసుక డంపులను తమ ఆధీనంలో ఉంచుకున్నామని ఇసుకను విక్రయించిన వారికి నోటీసులతోపాటు జరిమానాలను విధిస్తామని తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఇసుకను త్వరలోనే వేలం వేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి విక్రయాలు మళ్లీ జరిగితే జరిమానాలతోపాటు చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.


