epaper
Thursday, January 15, 2026
epaper

బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై తమ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని అన్నారు. అయితే ఈ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గతంలోనే తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని గుర్తు చేశారు. అయితే గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, అప్పటి నుంచి ఆ బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు.

అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018, 2019లో చేసిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల వల్లే రిజర్వేషన్ల అమలు కష్టంగా మారిందని సీఎం విమర్శించారు. ఈ చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, గవర్నర్ మళ్లీ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారని ఆయన తెలిపారు.

ఈ సమస్యపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని, కానీ బీఆర్ఎస్ ఎంపీలు సహకరించలేదని రేవంత్ ఆరోపించారు. బీసీల కోసం మాట్లాడుతున్నామని చెప్పుకునే గంగుల కమలాకర్ కూడా ఆ సమయంలో రాలేదని ఆయన విమర్శించారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ నాయకత్వానికి అస్సలు ఇష్టం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం కూడా అసెంబ్లీలో బిల్లులను ఆమోదించకుండా బీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని రేవంత్ స్పష్టం చేశారు. చివరగా, సహకరించని బీఆర్ఎస్‌కు భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img