epaper
Monday, March 2, 2026
epaper

బీసీ బిల్లును త్వరగా ఆమోదించాలని కేంద్రానికి గోల్కొండ కోటపై నుంచి విజ్ఞప్తి చేస్తున్నా: రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచంతో పోటీపడి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింస పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామన్న ముఖ్యమంత్రి.. స్వాతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గంగా చూపించిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలతో సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు పేదల సంక్షేమాలతో సరికొత్త మార్గం చూపించిన చరిత్ర అంటే కాంగ్రెస్ పాలనేనని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బియ్యం పథకం కేవలం ఆకలి తీర్చే పథకం కాదన్నారు. సన్న బియ్యం పథకం పేదల ఆత్మగౌరమానికి ప్రతీకా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. రేషన్ షాపులు పేదవాడి ఆఖరి తీర్చే భరోసా కేంద్రాలుగా మారాయని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సామాజిక, కుల, ఆర్థిక, రాజకీయ, విద్యా సర్వేను ఒక యజ్ఞంలా చేశామన్నారు. సామాజిక సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. మార్చి 2న బిల్లులు తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను త్వరగా ఆమోదించాలని గోల్కొండ కోట నుంచి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img