epaper
Thursday, January 15, 2026
epaper

రేవంత్ ఎన్న‌డూ జై తెలంగాణ అన‌లే..

  • తెలంగాణ సోయిలేని ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఉంది
  • స్థానిక ఎన్నిక‌ల్లో పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలే…
  • అక్టోబర్ 8న కోర్టు తీర్పును బట్టి త‌మ కార్యాచరణ ..
  • తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సోయిలేని ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంద‌ని, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ముఖ్య‌మంత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విచిత్రంగా అనిపించింద‌ని, గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పండుగ చేశార‌న్నారు. పదివేల మందితో బతుకమ్మ ఉత్స‌వాలు జ‌రిపి ప్రభుత్వం ఆడబిడ్డలను అవమానించింద‌ని మండిప‌డ్డారు. వచ్చే సంవత్సరం లక్షమంది మహిళలతో హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహిస్తామ‌న్నారు.

చింతమడక నుంచి లండన్ వరకు ఆదరించారు

చింతమడక నుంచి లండన్ వరకు తెలంగాణ ప్రజలు త‌నను ఆదరించార‌ని క‌విత అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని, అక్టోబర్ 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి త‌మ కార్యాచరణ ఉంటుంద‌ని స్ప‌ష్టంచేశారు. విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు రావ‌ని, రాజకీయపరమైన రిజర్వేషన్లకు ఇబ్బంది వస్తుంద‌న్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరి మనుషులు కోర్టుల్లో కేసులు వేశార‌ని ఆరోపించారు.

ఈట‌ల వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మా..?

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీ ఎన్నికలు జరిగితే కోర్టుల్లో క్యాన్సిల్ చేస్తామని అంటోంద‌న్నారు. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని అంటున్నార‌ని, బీజేపీ ఏమైనా కోర్టునా అన్నారు. ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, ఎంపీగా ఎట్లా మాట్లాడతార‌న్నారు. ఈటెల మాటలు వ్యక్తిగతమా..బీజేపీ స్టాండా చెప్పాల‌న్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్ గురించి బీజేపీ మాట్లాడాల‌ని, ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్ళు పట్టుకుని బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తేవాల‌న్నారు. బీజేపీ తెలంగాణ బీసీలకు క్షమాపణ చెప్పాల‌న్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమ‌న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించనిదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి అని, మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలని తెలంగాణవాదులు అంతా కోరుకున్నార‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంద‌న్నారు. రైతులకు యూరియా సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంద‌ని క‌విత విమ‌ర్శించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img