epaper
Thursday, January 15, 2026
epaper

సీఎం రేఖాపై దాడి కేసులో సంచలన ట్విస్ట్.. అందుకే దాడి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోని తాను ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశానని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.

జంతువు ప్రేమికుడైన తనను ఈ విషయం ఎంతగానో భాదించడంతోపాటు ఈ చర్యలను నిలిపివేయాలని అభ్యర్థించడానికి తాను ఢిల్లీ సీఎంను కలిసేందుకు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించి మరీ గుజరాత్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు సకారియా తెలిపాడు. సీఎం తన నివాసంలో కలిసి కుక్కల సమస్య గురించి మాట్లాడడానికి ప్రయత్నించగా అది కుదరకపోవడంతో జన్ సున్వాయ్ కార్యక్రమానికి వెళ్లినట్లు నిందితుడు తెలిపాడు. సమస్యను సీఎం రేఖా గుప్తాకు వివరించగా తన విజ్ఞప్తి ఆమె పట్టించుకోలేదని దాంతో కోపంతో దాడి చేశానని తెలిపాడు.

సకారియా కుక్కల సంరక్షణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాడని అతనికి మూగజీవాలు అంటే ఇష్టమని కుటుంబ సభ్యులు చెపుతున్నట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కుక్కలను షెల్టర్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అతను తీవ్ర నిరాశ గురైనట్లు చెబుతున్నారు. అయితే నిందితులు వాదనను ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కొట్టి పారేశారు.

నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ ప్రకారమే దాడి చేసి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రేఖా గుప్తా నివాసం దగ్గర అతను తచ్చాడుతున్న వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఊహించిన విధంగా తనపై జరిగిన దాడితో ఢిల్లీ ముఖ్యమంత్రి షాక్ లో ఉన్నారని.. కపిల్ మిశ్రా తెలిపారు. గాయాలైనప్పటికీ ఆమె ఇంటి నుంచి పని చేస్తున్నట్టు చెప్పారు. తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో ఢిల్లీ రేఖా గుప్తాకు ముప్పు పొంచి ఉండటంతో ఆమెకు జడ్ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ కు చెందిన 40-45 మంది సిబ్బంది సీఎం కూడా రక్షణ కల్పించే విధుల్లో ఉంటారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img