epaper
Thursday, January 15, 2026
epaper

పుర‌ పోరుకు సై

పుర‌ పోరుకు సై

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ప్ర‌ధాన పార్టీలు రెడీ

జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు.. 254 వార్డులు

ప‌ద‌వుల‌పై క‌న్నేసిన ఆశావ‌హులు

అధికార పార్టీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల జోష్

బీఆర్ఎస్‌కూ ఊర‌ట‌నిచ్చిన ఫ‌లితాలు

ఇదే ఊపు కొన‌సాగించాల‌ని భావిస్తున్న రెండు పార్టీలు

ఎమ్మెల్యేల దృష్టిలో ప‌డేందుకు అభ్య‌ర్థుల ప్ర‌య‌త్నాలు

ముఖ్య నేత‌లు, గాఢ్‌ఫాద‌ర్ల చుట్టూ ప్ర‌దక్షిణాలు

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వేడెక్కిన రాజ‌కీయం

జ‌న‌వ‌రిలో మున్సిప‌ల్‌ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. ఫిబ్ర‌వ‌రిలో పోలింగ్?

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ప‌ల్లెల్లో పంచాయతీ ఎన్నికల సంద‌డి ముగియ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌లు, పార్టీల దృష్టి మున్సిప‌ల్, ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై పడింది. ఇటీవ‌ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు, ఛాన్స్ వచ్చినా ఓడిపోయిన వారు… రానున్న ప‌రిష‌త్‌, మున్సిప‌ల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కేడర్‌లోనూ జోష్ పెంచాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలతోపాటు 74 జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మ‌రోమారు పట్టు సాధించేందుకు అధికార పక్షంతోపాటు మిగిలిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా వ‌చ్చే నెల‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆశావహులంతా త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకుంటున్నారు. దీంతో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది.

వ‌చ్చే నెలలోనే న‌గ‌రా!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1684 పంచాయతీల్లో 1008 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు విజ‌యం సాధించారు. వీరే కాకుండా మరో 120 మందికి పైగా రెబల్స్ కూడా అధికార పార్టీకి చెందిన వారే గెలిచారు. వీరంతా త్వ‌ర‌లోనే అధికార కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మరోవైపు వరుస ఓటములతో కుంగిపోతున్న గులాబీ శ్రేణుల‌కు సైతం పంచాయతీ ఎన్నికలు కొంత ఊర‌ట ఇచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 494 సర్పంచ్ స్థానాల్లో తన మద్దతుదారులను బీఆర్ఎస్ గెలిపించుకుంది. దీంతో గులాబీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నెల‌కొంది. ఇక బీజేపీతోపాటు సీపీఐ, సీపీఎంలు కూడా తమ ఉనికిని చాటుకునేలా సీట్లు సాధించాయి. ఇదే ఊపుతో రానున్న మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. గత జనవరిలోనే మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ముగిసింది. దీంతో సుమారు ఏడాది కాలంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ ప్ర‌భుత్వం వ‌చ్చే నెల‌లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు క‌స‌ర‌త్తు చేస్తుంద‌నే ప్రచారం జరుగుతోంది. దీంతో పట్టణ ఆశావాహుల్లో పదవులపై ఆశలు రేకెత్తుతున్నాయి.

12 మున్సిపాలిటీలు.. 254 వార్డులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాల‌పల్లి, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ తొమ్మిది మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతోపాటు మొత్తంగా 200 వార్డు కౌన్సిల్ పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. జనగామ, భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 చొప్పున వార్డులు ఉన్నాయి. ఇక ఇటీవల ప్రభుత్వం జిల్లా కేంద్రమైన ములుగును మున్సిపాలిటీగా మార్చింది. అలాగే స్టేషన్ ఘన్‌పూర్‌, కేసముద్రం కూడా మున్సిపాలిటీగా మారాయి. దీంతో ఈ మూడు కొత్త మున్సిపాలిటీల్లో 54 వార్డులను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 254 వార్డులు ఏర్పాటు అయ్యాయి. గ్రేట‌ర్ వరంగల్ కార్పొరేషన్ కు ఏప్రిల్ వరకు గడవు ఉండటంతో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా 12 మున్సిపాలిటీల్లో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఆశావాహులు కూడా ఇప్పటి నుంచే పదవుల కోసం ఎమ్మెల్యేల దృష్టిలో పడేలా కార్యాచరణ సిద్ధం చేస్తుండడంతో పట్టణాల్లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి.

ఓట‌ర్ల జాబితాపై ఈసీ ఫోక‌స్‌

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా రూపకల్పనపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. జనవరి రెండో వారం నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అధికార పార్టీ ఒక ‘సెమీఫైనల్’గా భావిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img