epaper
Thursday, January 15, 2026
epaper

రాహుల్ గాంధీతో యూపీ మంత్రి ఫైటింగ్..ఇదిగో వీడియో..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగా, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్యలో కల్పించుకుని మాట్లాడారు. దీంతో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తూ, “నేను అధ్యక్షత వహిస్తున్న సమావేశం ఇది. మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి” అని సూచించారు.

అయితే, రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి దినేశ్ వెంటనే స్పందించారు. ఆయన, “లోక్‌సభలో మీరు స్పీకర్ మాటను గౌరవిస్తున్నారా? అయితే ఇక్కడ నేను మీ మాట ఎందుకు గౌరవించాలి?” అని ప్రతివాదం చేశారు. ఈ మాటలతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. సమావేశంలో ఉన్న ఇతర సభ్యులు పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, దినేశ్ ప్రతాప్ సింగ్ మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు తమదైన కోణంలో ఈ ఘటనను ప్రచారం చేస్తున్నారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుతం బీజేపీ మంత్రిగా ఉన్న దినేశ్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన నేత. ఆయన 2022లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో విజయం సాధించి, యూపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో, రాహుల్ గాంధీతో ఆయన మాటల యుద్ధం మరింత చర్చనీయాంశమైంది.

రాయ్ బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం తెలిసిందే. దిశా సమావేశం కూడా అభివృద్ధి పనుల సమీక్ష కోసం ఏర్పాటు చేశారు. కానీ, మధ్యలో జరిగిన ఈ వాగ్వాదం కారణంగా అసలు అజెండా పక్కకు పోయింది. ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉన్న ఉద్రిక్తతను బయటపెట్టింది. బీజేపీ నుంచి వచ్చిన సవాళ్లను రాహుల్ గాంధీ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img