కాకతీయ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో కవిత కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. వాళ్లపార్టీ వ్యవహారం గురించి తాను మాట్లాడదల్చుకోలేదని తెలిపారు. కవిత చెప్పిన మోకిల ప్రాజెక్టు అవకతవకల గురించి విచారించాలన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
జడ్పీఅధ్యక్షుడిగా నన్ను ఓవరు ఓడించారో గతంలో కేసీఆర్ కు నేను చెప్పాను. ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూసినట్లు గతంలోనే చెప్పాను. కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడి ఉంటే బాగుండేది. ఆమె మాటలతో బీఆర్ఎస్ పునాదుల మీద విస్తరించిందని తేలింది. మళ్లీ వచ్చే ఎపిసోడ్ లో బీఆర్ఎస్ పెద్దలు చేసిన అవినీతి బయటపెడితే బాగుంటుందన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాల మీద మీరు పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని కవితను ప్రశ్నించారు రఘునందన్ రావు.


