కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ ను ర్యాగింగ్ చేసి సీనియర్స్ దారుణంగా కొట్టిన ఘటన బయటకు వచ్చింది.రాహుల్ రెడ్డి అనే మెడికల్ విద్యార్థిపై సీనియర్స్ దాడి చేశారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచే రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన అతను భరిస్తూ వస్తున్నట్లు తెలిసింది. రాహుల్ రెడ్డి పోస్టింగ్ కు వెళ్లినా విద్యార్థి సాయిరాం పవన్ ఆబ్సెంట్ అని వేశాడు.
ఈ విషయం గురించి మాట్లాడేందుకు వెళ్తే ఓ రూమ్ లోకి పిలిచి పది మంది సీనియర్లు రాహుల్ రెడ్డిపై దాడికి దిగారు. జాండిస్ వచ్చినట్లు రిపోర్టులు చూపించినా వదలకుండా ర్యాగింగ్ చేసినట్లు రాహుల్ రెడ్డి వాపోయాడు. దాడికి పాల్పడిన సీనియర్ హౌస్ సర్జన్స్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ మెడికోలు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్స్ని ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టిన సీనియర్స్
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుండి విద్యార్థి రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన సీనియర్స్.. భరిస్తూ వచ్చిన విద్యార్థి
సీనియర్స్ ఇంటర్న్షిప్ చేస్తూ అదే కాలేజీలో ఉండి, రాహుల్ రెడ్డిని నాలుగో… pic.twitter.com/rB4y0BA5TV
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025


