epaper
Sunday, March 1, 2026
epaper

నేరాల నియంత్ర‌ణ‌లో పురోగ‌తి

నేరాల నియంత్ర‌ణ‌లో పురోగ‌తి
కరీంనగర్ క‌మిష‌న‌రేట్‌లో 16.84 శాతం తగ్గుదల
6,421 కేసులు నమోదు – 5,126 కేసులు చేధ‌న‌
రూ.2.04 కోట్ల ఆస్తి రికవరీ
2025 వార్షిక నేరాల నివేదిక విడుదల చేసిన సీపీ గౌస్ ఆలం

కరీంనగర్, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, నేర నియంత్రణకు తీసుకున్న చర్యలు, ప్రజా భద్రతకు చేపట్టిన కార్యక్రమాలపై కీలక గణాంకాలను వెల్లడించారు. వార్షిక నివేదిక ప్రకారం 2025లో మొత్తం 6,421 నేర కేసులు నమోదు కాగా, 2024లో నమోదైన 7,361 కేసులతో పోలిస్తే నేరాల్లో 16.84 శాతం తగ్గుదల నమోదైనట్లు సీపీ తెలిపారు. ఇది జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సాధించిన ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు. ముందస్తు చర్యలు, పటిష్టమైన గస్తీ, నిఘా వ్యవస్థ బలోపేతం, ప్రజలతో సమన్వయంతో అమలు చేసిన పోలీసింగ్ కార్యక్రమాల ఫలితంగానే నేరాల తగ్గుదల సాధ్యమైందని వివరించారు.

కేసుల ఛేదింపులో మెరుగైన ఫలితాలు

2025లో నమోదైన కేసుల్లో భారతీయ దండన విధానం (ఐపీసీ) మరియు ప్రత్యేక చట్టాల కింద మొత్తం 5,126 కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు సీపీ తెలిపారు. ఆధునిక సాంకేతికత వినియోగం, టాస్క్‌ఫోర్స్ దాడులు, సైబర్ నిఘా, క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది సమన్వయం వల్లే కేసుల పరిష్కారంలో మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఆస్తి నేరాల విభాగంలో 2025లో మొత్తం 505 కేసులు నమోదు కాగా, వాటిలో 251 కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో రూ.4.11 కోట్ల విలువైన ఆస్తి నష్టం నమోదు కాగా, అందులో నుంచి రూ.2.04 కోట్ల విలువైన ఆస్తిని రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించినట్లు సీపీ వెల్లడించారు. దీంతో ఆస్తి రికవరీ శాతం 49.62 శాతానికి చేరిందన్నారు. అదేవిధంగా జిల్లాలో గ్రేవ్ క్రైమ్స్‌లో 9.09 శాతం, మహిళలపై నేరాల్లో 5.18 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. వరుసగా రెండేళ్లుగా డకాయిటీ కేసులు ఒక్కటీ నమోదు కాకపోవడం కరీంనగర్ పోలీస్ శాఖ సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు.

కోర్టుల్లో పోలీసుల విజయం

2025లో మొత్తం 2,531 కేసులు కోర్టుల వరకు వెళ్లగా, వాటిలో 781 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. దీంతో శిక్షల శాతం 30.85 శాతానికి చేరిందని, గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతంలో 7 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఇది దర్యాప్తు నాణ్యత మెరుగుపడటం, కేసులపై క్రమం తప్పని కోర్టు మానిటరింగ్ చేపట్టిన ఫలితమని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి 205 కేసులను ఛేదించడంతో పాటు, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ ద్వారా బాధితులకు రూ.1.10 కోట్లకు పైగా నగదు రిఫండ్ చేయడం జరిగిందన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రానున్న రోజుల్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img