కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..
ఆర్ఐ , సర్వేయర్ ల అవినీతిపై
నిగ్గు తెల్చేనా..?
లేక అధికారులకు వంత పాడుతూ మభ్యపెడతారా..?
పట్టా పాస్ బుక్ అవినీతి వ్యవహారంపై కొత్త తహసీల్దార్ దారి ఎటూ?
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్ కు మండలం నుండి అవినీతి సవాళ్లు ఎదురవనున్నాయి. కొత్త తహసీల్దార్ సమస్యల సవాళ్లకు సిద్ధంగా ఉన్నారా ..? కార్యాలయంలో అవినీతి అధికారుల భరతం పడతారా..? లేక ఉదాసీనత చూపిస్తూ రైతులకు కన్నీటి కష్టాలు మిగుల్చుతారా.? గత ఏడాది కాలంగా కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాల రైతుల నుండి రైతులు ఎకరాకు 20 వేల నుండి 40వేల వరకు పట్టా పాస్ బుక్ కోసం రైతులు ఆర్ఐ, సర్వేయర్ ల తొత్తులుగా వ్యవహరించిన దళారుల నుండి లక్షల రూపాయలు దండుకున్నారు.. ఇలా పట్టా పాస్ బుక్ కోసం వేల రూపాయల డబ్బులు ముట్టచెప్పినట్టుగా ఆరోపణలు ఎప్పటినుండో వెల్లువెత్తుతున్నాయి.. ఆర్ఐ , సర్వేయర్ లపై గత తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని రైతుల నుండి వత్తిడి వచ్చిన ఉదాసీనతగా వ్యవహరించి విమర్శలపాలైయారు.. ఇప్పుడు ఆ తహసీల్దారు బదిలీపై వెళ్లడంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్ డి సైదులు పై రైతులకు కొత్త ఆశలు పెట్టుకున్నారు.. నిజమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న , ఏళ్లనాటి నుంచి సొంత భూమి ఉండి కూడా ప్రభుత్వాలు ప్రవేశపడుతున్న రైతు సంక్షేమ పథకాలకు దూరంగానే ఉన్నారు.. ఇదే అదునుగా భావించిన కూసుమంచి మండలంలోని ఆర్ఐ సర్వేయర్ తమ దళారుల నుండి ఎకరానికి వేల రూపాయల డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ పట్టా పాస్ బుక్ రాకపోవడంతో రైతు భరోసా కు, రైతు బీమాకు , బ్యాంకులో వ్యవసాయసి లోన్లకు దూరం అవుతున్నాం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆర్ ఐ, సర్వేయర్ ల మాటలతో దళారులను నమ్మి డబ్బులు ముట్టచెప్పిన రైతులని గుర్తించి న్యాయం చేస్తారా లేదా వేచి చూడాలి. గత రెండు వారాలుగాపట్టా పాస్ బుక్ ల కోసం రెవిన్యూ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయంపై కాకతీయ దినపత్రికలో వరుస కధనాలు వెలువడ్డాయి.. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉంటా తతంగం జరిగిన తర్వాత తహసీల్దారు బదిలీపై వెళ్లడంతో కొత్త తహసీల్దార్ కు నిజానిజాలు తెలియాలంటే గ్రామాలలో విచారణ చేపట్టి రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నిజామా..? కదా..? నిగ్గు తేల్చి బాధ్యులైన అధికారులపై విచారణ చేపట్టాలని కోరుకుంటున్నారు.


