epaper
Thursday, January 15, 2026
epaper

బాలుడి మృతదేహంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముట్టడి

బాలుడి మృతదేహంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముట్టడి
నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది సస్పెండ్ చేయాలంటూ ఆగ్రహం
మంత్రి సీతక్క హామీతో ధర్నా విరమణ

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో 7 ఏళ్ల బాలుడు పాము కాటుతో మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గూర్రేవుల గ్రామానికి చెందిన తిరునగిరి రాజు, సంగీత దంపతుల కుమారుడు హరినాథ్ (7) శనివారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా నాగుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే విధుల్లో ఉన్న వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ “యాంటీడోస్ ఇంజెక్షన్ లేదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తదుపరి నాటు వైద్యుడి వద్దకు బాలుడిని తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్సకు నిరాకరించాడు. అనంతరం 108 అంబులెన్సులో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆదివారం కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బాలుడి మృతదేహంతో ముట్టడి చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరని, ప్రథమ చికిత్స కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం గ్రామస్తులు, బంధువులు కలిసి ఏటూరునాగారం–తుపాకులగూడెం ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని, బాధ్యులైన వైద్యుడు అభినవ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు — మంత్రి సీతక్క

ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు యం.డి. అప్సర్ పాషా ఫోన్ ద్వారా మంత్రి సీతక్కకు సమాచారం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క బాలుడి మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కన్నాయిగూడెం మండలంలో 24 గంటల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img