epaper
Monday, March 2, 2026
epaper

పార్లమెంట్ కార్యాలయం వద్ద పొలిటికల్ వార్!

పార్లమెంట్ కార్యాలయం వద్ద పొలిటికల్ వార్!
కరీంనగర్‌లో కాంగ్రెస్–బీజేపీ ఢీ… నినాదాలతో రణరంగం

కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ బీజేపీ కార్యాల‌యం వ‌ద్ద గురువారం హైటెన్ష‌న్ నెల‌కొంది. నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ హోరాహోరీగా ఎదురుదిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంట్ కార్యాలయం వైపు ర్యాలీగా చేరేందుకు ప్రయత్నించగా, ముందుగానే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు కూడా అక్కడికి చేరడంతో నినాదాల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిసర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

కాంగ్రెస్ కార్యాలయం వైపు బీజేపీ కదలిక

పార్లమెంట్ కార్యాలయం వద్ద జరిగిన పరిణామాల అనంతరం బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. దీంతో పరిస్థితి మరింత చేయి దాటే ప్రమాదం కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనతో నగర కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్లు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చట్టపరమైన అంశమని, దీనిని రాజకీయంగా మలచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

‘2008 నుంచే కేసు… మోదీ ప్రభుత్వంతో సంబంధం లేదు’

నేషనల్ హెరాల్డ్ కేసు 2008లోనే ప్రారంభమైందని, ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరిస్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసును రాజకీయ రంగు పులిమి ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్‌కు తగదని హెచ్చరించిన బీజేపీ నేతలు, ఇలాంటి రాజకీయ ఆటలు కొనసాగితే తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. అవసరమైతే తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు శివాలయంలో మహా అన్నదానం నిర్వహణ గాంధీ...

ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి

ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి 250 గజాల భూమి, రూ.20 వేల...

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు అక్రమ...

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ! శంకరపట్నం వారసంత రోడ్డుపై ఏర్పాటు జాతీయ రహదారిపై ప్రమాదాలకు...

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ రాజీమార్గమే రాజమార్గం అంటూ ముందుకు...

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్ కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని...

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img