- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ సమావేశం
- పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు
కాకతీయ, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజకీయ నాయకులందరూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. మొదటి విడతలో హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో, రెండో విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో, మూడో విడతలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాలల పరిధిలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయని, నాలుగో విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు సహా మానకొండూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉంటాయని తెలిపారు.
జిల్లాలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల, అంబేద్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తామని, గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, ధరావత్తు వివరాలు, ఎన్నికల వ్యయం, నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, బిజెపి ప్రతినిధులు నాంపల్లి శ్రీనివాస్, బాస సత్యనారాయణ, వాసాల రమేష్, కాంగ్రెస్ తరపున సిరాజ్ హుస్సేన్, మడుపు మోహన్, బిఆర్ఎస్ ప్రతినిధి సాతినేని శ్రీనివాస్, సిపిఐ(ఎం) ప్రతినిధి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ ప్రతినిధి కే.మణికంఠ రెడ్డి, ఏఐఎంఐఎం ప్రతినిధి సయ్యద్ బర్కత్ అలీ, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బి.ఎస్.పి ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.


