epaper
Saturday, November 15, 2025
epaper

వృద్ధ దంపతుల హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు

  • రిమాండ్ కు నిందితుడి త‌ర‌లింపు
  • వివ‌రాలు వెల్ల‌డించిన క‌రీంన‌గ‌ర్ సీపీ

కాకతీయ, కరీంనగర్ : క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధర మండ‌లం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘర్షకుర్తి గ్రామంలో ఇటీవ‌ల వృద్ధ దంపతులపై జ‌రిగిన‌ హత్య, హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం సోమ‌వారం వెల్ల‌డించారు. గంగాధర పోలీసు స్టేషన్ పరిధిలోని గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య (76), ఆయన భార్య లక్ష్మి (70) దంపతులు ఒంటరిగా నివాసం ఉంటున్నారు. వీరికి ప‌క్క‌నే వేరే ఇంటిలో నివసించే కత్తి శివ అప్పుడప్పుడు వారికి సహాయం చేస్తూ, నమ్మకాన్ని పెంచుకున్నాడు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్, పేకాట అలవాట్లతో అప్పుల్లో కూరుకుపోయిన నిందితుడు, దంపతుల వద్ద ఉన్న బంగారు పుస్తెల తాడును దోచుకోవాలన్న ఉద్దేశంతో పథకం వేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

గతంలో ముంబైలో కల్లు దుకాణంలో పనిచేసిన సమయంలో అక్కడ ఉపయోగించే మత్తు మాత్రలను దాచివుంచి, అక్టోబర్ 7న వృద్ధ దంపతులకు జ్వరం, జలుబు తగ్గేందుకు అంటూ న‌మ్మించి ఆ మాత్రలను ఒక్కొక్కరికి ఆరు చొప్పున నిందితుడు శివ మింగేలా చేశాడు. మాత్ర‌లు మింగి వృద్ధులు మత్తులోకి వెళ్లిన తర్వాత లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించి గ్రామంలోని బంగారం వ్యాపారి కట్ల శ్రీనివాసాచారికు అమ్మి రూ.1.85 లక్షలు నగదు తీసుకున్నాడు. దానిలో కొంత డబ్బును అప్పులు తీర్చడానికి, మిగతాదాన్ని పేకాట, బెట్టింగ్ కోసం వినియోగించినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడ‌ని సీపీ తెలిపారు.

కాగా వృద్ధులను అపస్మార స్థితిలో ఆసుపత్రికి తరలించగా, శంకరయ్య మరుసటి రోజు మృతి చెందగా, లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కూడా విషమంగా ఉందని అయ‌న తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన గంగాధర పోలీసులు, అక్టోబర్ 13న మిగిలిన మత్తు మాత్రలను పారేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ. 25వేల నగదు, 11 మత్తు మాత్రలు, టెక్నో మొబైల్ ఫోన్, 20.250 గ్రాముల బంగారు తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించామని సీపీ తెలిపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఏస్ఐ వంశీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్ కృషితో క్లూస్‌ను సేకరించి నిందితుడిని పట్టుకున్నారన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img