epaper
Saturday, November 15, 2025
epaper

41 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

రూ.20 లక్షల 50 వేల విలువ గల గంజాయి స్వాధీనం..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్..

కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మరోసారి గంజాయి అక్రమ రవాణాపై ముట్టడి చేశారు. పక్కా సమాచారంతో సిబ్బంది సోదాలు నిర్వహించి, రూ.20 లక్షల 50 వేల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ పి. నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన రాను హోస్సైన్, నూర్ మహమ్మద్ మియా. వీరిద్దరూ కోచ్ బేహార్ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. రాను హోస్సైన్ గంజాయి సరఫరాదారు కృష్ణ చంద్ర బర్మన్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో విక్రయించేవాడు.

ఈ వ్యాపారంలో లాభాలు రావడంతో తన స్నేహితుడు నూర్ మహమ్మద్‌ను కూడా కలుపుకున్నాడు. ఇద్దరూ కలిసి గత నెలలో రూ.2 లక్షలతో 41 కిలోల గంజాయి కొనుగోలు చేసి, లగేజ్ బ్యాగుల్లో దాచుకొని రైలు మార్గంలో సికింద్రాబాద్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. మధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారన్న భయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయి, బస్సులో హనుమకొండకు చేరుకున్నారు.

అనంతరం సికింద్రాబాద్ వెళ్ళే లారీ కోసం ముచ్చెర్ల క్రాస్ వద్ద వేచి ఉన్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 41 కిలోల గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇతర రాష్ట్రాల నుండి గంజాయి రవాణా చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఏసీపీ పి. నర్సింహారావు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చురుకుగా వ్యవహరించిన కెయూసీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్, ఎస్‌ఐ ఏ. కళ్యాణ్‌కుమార్, పెట్రోలింగ్ సిబ్బందిని ఆయన అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img