పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఏడుగురు అరెస్ట్.. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
కాకతీయ, ములుగు ప్రతినిధి: మండలంలోని దేవగిరిపట్నం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై ములుగు పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.23,600 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాద్ ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో ఈ దాడి చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడిలో ఎస్ఐ బి. చంద్రశేఖర్, సివిల్ పోలీసులు, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.


