epaper
Saturday, November 15, 2025
epaper

పోలీస్ అంటే నమ్మకం

  • విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి
  • ఖాకీలంతా నైతిక విలువలు పెంపొందించుకోవాలి
  • అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
  • ప్రమోద్​ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తాం
  • మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
  • సీఎం రేవంత్​ రెడ్డి
  • పోలీసు అమ‌ర‌వీరుల‌కు ముఖ్య‌మంత్రి ఘ‌న నివాళి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా అని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని సీఎం అన్నారు. హైదరాబాద్​లోని గోషామహల్​ పోలీస్​ గ్రౌండ్స్​లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సైబర్​ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ముందుందని వివరించారు. ఈక్రమంలోనే ఇటీవల అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారని, మిగతా మావోయిస్టులను కోరుతున్నానన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.

పోలీసుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం

1959 అక్టోబరు 21న భారత్​, చైనా సరిహద్దుల్లో 10 మంది జవాన్లు వీరమరణం పొందారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి నుంచి ఏటా ఈరోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీరమరణం పొందారని వెల్లడించారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల చనిపోయిన ప్రమోద్​ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటిస్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానం

పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని సీఎం రేవంత్​రెడ్డి కొనియాడారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్​ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్​ పేరుతో ప్రత్యేక బృందం నియమించామన్న ఆయన, సైబర్​, డిజిటల్​, మార్ఫింగ్​, డ్రగ్స్​లో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలకు దాంతోనే సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు.

జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి

“అనేక విభాగాలకు మహిళా ఐపీఎస్​లు సారథ్యం వహిస్తున్నారు. పోలీసు డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితం త్యాగం చేస్తున్నారు. పోలీసు సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పని చేయాలని కోరాం. మా ప్రభుత్వం 16 వేల మంది కానిస్టేబుల్​, ఎస్​ఐ పోస్టులు భర్తీ చేసింది. పోలీసులకు ఏదైనా జరిగితే దేశంలోనే అత్యధిక పరిహారం ఇస్తున్నాం. పోలీసు పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశాం. పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకత, నైతిక విలువలు పాటించాలి. ఇలాగే పని చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుతున్నాను. శరవేగంగా అభివృద్ధి చెందే మన రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా కీలకం. సోషల్​ మీడియా యుగంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చూడాలి.” – రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img