epaper
Monday, March 2, 2026
epaper

క‌విత కొత్త పార్టీ !

క‌విత కొత్త పార్టీ !

జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదు

సమయం, సందర్భం, అవసరం మేర‌కు నిర్ణ‌యం

ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన

క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

25 నుంచి జ‌నంబాట‌కు శ్రీకారం

33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమం

యాదిగిరిగుట్ట‌లో ప్ర‌త్యేక పూజ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా? అనే చర్చ కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి కవిత మ‌రోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి “జనంబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం యాదగిరిగుట్ట శ్రీనరసింహస్వామిని కవిత దర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన క‌విత‌.. ప్ర‌జ‌లు కోరుకుంటే త‌ప్ప‌కుండా కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటుచేస్తాన‌ని అన్నారు.

25 నుంచి జ‌నంబాట‌

ఈనెల 25 నుంచి తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనంబాట కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాలని మొన్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని, ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నాన‌ని చెప్పారు.
19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. తాము ఒక ఎన్జీవోగా ఏర్పాటైనప్పటికీ… ప్రతి నిత్యం ప్రజల కోసమే మాట్లాడమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడమని, ఇక్కడి ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన చేశామని తెలిపారు. ఈరోజు కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌గా ఉన్నప్పటికీ… రాజకీయాలు మాట్లాడుతామని, ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదన్నారు.

సమయం, సందర్భం బ‌ట్టి..

అయితే పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించారు. తమిళనాడు, ఏపీ, కేరళలో పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ప్రస్తావించారు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని, జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదని… దానికి సమయం, సందర్భం, ప్రజలకు అవసరం ఉండాలని అన్నారు. పార్టీ అనే దానితో ప్రజలకు మేలు జరగాలని తెలిపారు. ప్రజల కోసమే తన పర్యటన అని చెప్పారు. జాగృతి జనం బాట 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కవిత తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి… అక్కడి మేధావులను, విద్యావంతులను, విద్యార్థులను, రైతులను, మహిళలను కలిసి… అక్కడి సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని నమ్ముతున్నట్టుగా తెలిపారు.

కొత్త పార్టీ దిశగా అడుగులు !

గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలు కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జాగృతి జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈ యాత్ర తర్వాత కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ… పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించ‌డం చ‌ర్చ‌నీయమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img