epaper
Saturday, November 15, 2025
epaper

క‌విత కొత్త పార్టీ !

క‌విత కొత్త పార్టీ !

జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదు

సమయం, సందర్భం, అవసరం మేర‌కు నిర్ణ‌యం

ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన

క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

25 నుంచి జ‌నంబాట‌కు శ్రీకారం

33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమం

యాదిగిరిగుట్ట‌లో ప్ర‌త్యేక పూజ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా? అనే చర్చ కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి కవిత మ‌రోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి “జనంబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం యాదగిరిగుట్ట శ్రీనరసింహస్వామిని కవిత దర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన క‌విత‌.. ప్ర‌జ‌లు కోరుకుంటే త‌ప్ప‌కుండా కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటుచేస్తాన‌ని అన్నారు.

25 నుంచి జ‌నంబాట‌

ఈనెల 25 నుంచి తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనంబాట కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగాలని మొన్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని, ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నాన‌ని చెప్పారు.
19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. తాము ఒక ఎన్జీవోగా ఏర్పాటైనప్పటికీ… ప్రతి నిత్యం ప్రజల కోసమే మాట్లాడమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడమని, ఇక్కడి ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన చేశామని తెలిపారు. ఈరోజు కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌గా ఉన్నప్పటికీ… రాజకీయాలు మాట్లాడుతామని, ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదన్నారు.

సమయం, సందర్భం బ‌ట్టి..

అయితే పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించారు. తమిళనాడు, ఏపీ, కేరళలో పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ప్రస్తావించారు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదని, జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదని… దానికి సమయం, సందర్భం, ప్రజలకు అవసరం ఉండాలని అన్నారు. పార్టీ అనే దానితో ప్రజలకు మేలు జరగాలని తెలిపారు. ప్రజల కోసమే తన పర్యటన అని చెప్పారు. జాగృతి జనం బాట 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కవిత తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి… అక్కడి మేధావులను, విద్యావంతులను, విద్యార్థులను, రైతులను, మహిళలను కలిసి… అక్కడి సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని నమ్ముతున్నట్టుగా తెలిపారు.

కొత్త పార్టీ దిశగా అడుగులు !

గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలు కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జాగృతి జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈ యాత్ర తర్వాత కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ… పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుందని ప్రకటించ‌డం చ‌ర్చ‌నీయమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img