epaper
Sunday, March 1, 2026
epaper

వ‌యాగ్రాల‌తో హ‌త్య‌కు ప్లాన్‌..!

  • 15 మాత్ర‌లు ఒకేసారి భోజ‌నంలో క‌లిపిన భార్య‌
  • క‌రీంన‌గ‌ర్ లో హ‌త్య కేసును చేధించిన పోలీసులు
  • ద‌ర్యాప్తులో షాక్ గురి చేసే నిజాలు వెలుగులోకి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : క‌త్తి సురేష్ హ‌త్య‌కేసును క‌రీంన‌గ‌ర్ పోలీసులు చేధించారు. తాగుడుకు బానిసై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న క‌త్తి సురేష్‌ను (36) భార్య మౌనిక మ‌ద్యంలో నిద్ర‌మాత్రలు క‌లిపి అప‌స్మార‌క స్థితిలోకి చేరుకున్నాకా.. కిటీకి చీర‌తో ఉరివేసి చంపేసిన‌ట్లు క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం వెల్ల‌డించారు. ఈ హ‌త్య‌కు ప‌రోక్షంగా స‌హ‌క‌రించిన మొత్తం ఐదుగురిని కూడా అరెస్టు చేసిన‌ట్లు సీపీ తెలిపారు. సెప్టెంబరు 17న క‌రీంన‌గ‌ర్ జిల్లాకేంద్రంలో అనుమానాస్ప‌ద స్థితిలో క‌త్తి సురేష్ మ‌ర‌ణించాడు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భార్యే హంత‌కురాలిగా గుర్తించారు. ఈ కేసులో మృతు భార్యతో పాటు మొత్తం ఆరుగురు నిందితులను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివ‌రాల‌ను గురువారం క‌రీంన‌గ‌ర్ సీపీ గౌస్ ఆలం త‌న కార్యాల‌యంలో మీడియాకు వెల్ల‌డించారు. సీపీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప‌ట్ట‌ణానికి చెందిన‌ కత్తి సురేష్ (36) కు 2015లో మౌనిక (29)ను ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.

భ‌ర్త వేధింపుల‌తో హ‌త్య‌కు ప్లాన్‌..

సురేష్ మ‌ద్యానికి బానిస కావ‌డంతో ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. ఈక్ర‌మంలోనే ఆమెకు దొమ్మాటి అజయ్ (28)తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. భర్త తరచూ డబ్బు కోసం వేధించడమే కాకుండా తన స్వేచ్ఛకు అడ్డు వ‌స్తున్నాడ‌నే నెపంతో సురేష్‌ను హ‌త్య చేయాల‌ని మౌనిక ప‌థ‌కం ర‌చించింది. ఇందుకు తన స‌మీప‌ బంధువు అరిగే శ్రీజ (32)తో ఈ విష‌యంపై చ‌ర్చించింది. త‌న‌కు ప‌రిచ‌య‌స్తుడైన మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ (27)కు మౌనిక‌ను శ్రీజ ప‌రిచ‌యం చేసింది. వీరితో పాటు త‌న మిత్రురాలు వేముల రాధ అలియాస్ నల్ల సంధ్య (39), ఆమె భర్త నల్ల దేవదాస్ (49)లకు సైతం పరిచయం చేసింది. సురేష్‌ను చంపేందుకు ర‌క‌ర‌కాల ఆలోచ‌నల పంచుకున్నారు.

భోజ‌నంలో 15 వ‌యాగ్రా మాత్ర‌లు..

ఒక రోజు సురేష్‌కు భోజనంలో 15వ‌యాగ్రా మాత్ర‌ల‌ను ఒకేసారి భోజ‌నంలో క‌లిపి ఇవ్వ‌డంతో భోజ‌నం ఏదో వాస‌న వ‌స్తోంద‌ని తిన‌డానికి సురేష్ నిరాక‌రించాడు. అయితే గ‌త నెల 17న మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ సూచన మేరకు, టెల్మికిండ్-(హెచ్‌80) (బీపీ మందులు), ట్రైకా (నిద్ర మాత్రలు) మిశ్రమాన్ని మద్యంలో కలిపి ఇవ్వ‌డంతో సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత‌ చీరను కిటికీ గ్రిల్‌కు కట్టి దాన్ని సురేష్ మెడకు చుట్టి గట్టిగా లాగి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం ఆమె తన అత్తమామలకు ఫోన్ చేసి, లైంగిక చర్య సమయంలో భర్త స్పృహ కోల్పోయాడని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది.

కుటుంబ స‌భ్యుల అనుమానంతో వెలుగులోకి..!

ఘ‌ట‌న జ‌రిగిన తీరుపై సురేష్ కుటుంబ స‌భ్యులు, బంధువులు అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో సురేష్ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శాస్త్రీయ ఆధారాలతో సహా టెక్నికల్ ఎనాలసిస్‌లో హ‌త్య‌గా నిర్ధార‌ణ కావ‌డం, దర్యాప్తులో మౌనికతో పాటు మిగతా ఐదుగురు నిందితులు కూడా హత్యకు కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నార‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం తెలిపారు. నిందితుల మధ్య జరిగిన చాట్‌లు, వాడిన మందులు, మద్యం బాటిళ్లు తదితర అంశాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, వారిని న్యాయపరమైన కస్టడీకి అప్పగించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కరీంనగర్ ఏసీబీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, వారి బృందం కీలక పాత్ర పోషించడంతో వారి దర్యాప్తును కమిషనర్ గౌస్‌ ఆలం అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img