ఈ నెల 19వ తేదీ నుంచి ఫార్మ్డీ కోర్సుల పరీక్షలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ ఆగష్టు 4 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్డీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల ఫార్మ్డీ మొదటి, రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్, మూడేళ్ల ఫార్మ్డీ మొదటి, రెండో సంవత్సరం మెయిన్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.


