కాకతీయ, వరంగల్ సిటీ : భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు. సమర్థవంతం గా చర్యలు చేపట్టాలంటూ అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని నాలుగు మండలాలలైనా వరంగల్, సంగెం , ఖిలా వరంగల్, వర్ధన్నపేటలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని.. అత్యధికంగా సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం, ఖిలా వరంగల్ మండలంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, గాంధీ నగర్,డి కే నగర్,లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంట తదితర ప్రాంతాలను సందర్శించారు కలెక్టర్.
వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రైన్ లు ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఖిలావరంగల్ నుండి వరంగల్ వరకు జీ డబ్ల్యూ ఎం సి తరపున అట్టి నాలా ను విస్తరించడానికి పనులు కొనసాగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలలో ఎమర్జెన్సీ ప్లాన్ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మంగళవారం రాత్రి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు నేపథ్యంలో పిల్లలను పాఠశాలకు పంపించకూడదని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో ప్రాణహాని ఉంటుందని కావున పిల్లలను చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలన్నారు.
విద్యుత్ సంబంధ వస్తువులను తాగకుండా ఉండాలని.. వర్షాలు కురిసే క్రమంలో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంటుందని భారీగా నీరు నిలిచి ఉండే లోతట్టు ప్రాంతాలకు విద్యుత్తు నిలిపివేయడం జరిగిందన్నారు. ఒకరోజు పునరావాస కేంద్రాలలో ఆవాసం పొందడం వల్ల కలిగే నష్టం ఏమీ లేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వారు అందజేసిన సాటిలైట్ ఇమేజ్ లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ అన్నారు.
బల్దియా కమిషనర్ మాట్లాడుతూ జీ డబ్ల్యూ ఎం సి తరపున డి ఆర్ ఎఫ్ బృందాలు అప్రమత్తం గా ఉన్నాయని ప్రతి వార్డులో జవాన్ తో పాటు ప్రత్యేక మాన్ సూన్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతే కాకుండా ఇంజనీరింగ్ బృందాలు కూడా క్షేత్ర స్థాయి లో సంసిద్ధం గా ఉన్నారని వర్షపు నీటిని వేగవంతంగా బయటకు పంపించడానికి కచ్చా కాలువల ద్వారా పంపించడం చేస్తున్నారన్నారు. శాశ్వత పరిష్కారం కోసం నాలా ను విస్తరించడం తో పాటు డ్రైన్ ఆక్రమణలను తొలగించడం జరుగుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమీప ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని ప్రస్తుతం 6 పునరావాస కేంద్రాలు ఎస్ ఆర్ నగర్ లో శుభం గార్డెన్,గాంధీ నగర్, మైసయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో,డి కే నగర్ లో బీరన్నకుంట హై స్కూల్ ,గిరి ప్రసాద్ నగర్ లోని కమ్యూనిటీ హాల్,ఏం ఎన్ నగర్ లోని మార్వాడీ హాల్ లో లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఆయా కేంద్రాలలో ప్రజలు ఆవాసం పొందుతున్నారని.. ఉదయం సుమారు 1300 మందికి అల్పాహారం అందించినట్లు తెలిపారు. లంచ్ తో పాటు డిన్నర్ కూడా అందజేస్తామని ప్రజల అవసరాల కోసం వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ : 18004251980,మొబైల్ నంబర్: 9701999676 అందుబాటు లోకి తెచ్చామని ప్రజలు ఈ నంబర్ లలో సంప్రదించాలని జీ డబ్ల్యు ఎం సి తరఫున 2 డిఆర్ఎఫ్ బృందాలు 24×7 మూడు షిఫ్టులలో పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి,డి ఏం&హెచ్ ఓ సాంబశివరావు ఎన్పిడిసిల్ ఎస్ ఈ గౌతమ్ రెడ్డి, ఆర్ డి ఓ సత్యపాల్ రెడ్డి సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఈ ఈ సంతోష్ బాబు డిఎఫ్ ఓశంకర్ లింగం, తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్ నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


