కాకతీయ, నేషనల్ డెస్క్: గోవా ఎయిర్పోర్ట్లో విమానం ఆలస్యం అయినా ప్రయాణికులు నిరాశ చెందలేదు. పైలట్ అనారోగ్యం కారణంగా ఈ జాప్యం జరిగినట్లు ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో గోవా నుంచి సూరత్ కు వెళ్లి గర్భా ఉత్సవాల్లో పాల్గొనాలని భావించిన మయూర్ అనే వ్యక్తి ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో అతడి నిరాశను ఎయిర్ పోర్టు సిబ్బందితో షేర్ చేసుకున్నాడు. అయితే మయూర్ నిరాశను గమనించిన ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి అద్భుతమైన ఐడియా వచ్చింది. అతడి నిరాశను మరిచిపోవడానికి ఎయిర్ పోర్టు టెర్మినల్ లోనే మ్యూజిక్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి గర్భా పాటలను ప్లే చేశారు.
దీంతో మయూర్ తోపాటు అక్కడున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉత్సాహతో ముగిపోయారు. సామూహికంగా గర్భా న్రుత్యం చేశారు. ప్రయాణికులతోపాటు ఎయిర్ పోర్టు సిబ్బంది కూడా డ్యాన్స్ లో పాల్గొని పండగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. విమానం ఆలస్యం కావడంతో ఏర్పడిన నిరుత్సాహాన్ని మర్చిపోయే విధంగా ఈ గర్భా డ్యాన్స్ ప్రయాణికులకు మరపురాని అనుభూతి ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
విమానం ఆలస్యం కావడంతో ఎయిర్పోర్టులో గుజరాతీ ప్రయాణికుల గర్భా డ్యాన్స్
గోవా నుంచి సూరత్కు వెళ్లే విమానం ఆలస్యం కావడంతో.. సిబ్బంది సాయంతో, విమానాశ్రయంలో స్పీకర్లు ఏర్పాటు చేసి గర్భా డ్యాన్స్ వేసిన ప్రయాణికులు pic.twitter.com/UfTRQSaeeU
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025


