epaper
Thursday, January 15, 2026
epaper

Viral News: హోంవర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ కర్కశం

కాకతీయ, నేషనల్ డెస్క్: హర్యానాలోని పానిపట్‌లో ఉన్న శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ కఠినంగా శిక్షించింది. బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి, డ్రైవర్ చేతితో కొట్టించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళితే, ఆగస్టు 13న ఈ సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో బాలుడిని కిటికీకి వేలాడదీసి డ్రైవర్ అజయ్ కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాక, మరో వీడియోలో ప్రిన్సిపాల్ రీనా, ఇతర విద్యార్థుల ముందు ఇద్దరు పిల్లలను నిరంతరం కొట్టడం, చెవులు పిండడం కూడా బయటపడింది. ఈ వీడియో సెప్టెంబర్ 27న బయటపడటంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ రీనా, డ్రైవర్ అజయ్‌లను అరెస్టు చేశారు. వారిపై బీఎన్ఎస్ చట్టంలోని 115, 127(2), 351(2) సెక్షన్లతో పాటు బాలల హక్కుల చట్టంలోని సెక్షన్ 75 కింద కేసులు నమోదు చేశారు.

అయితే ప్రిన్సిపాల్ రీనా తనపై వచ్చిన ఆరోపణలను కొంతమేర అంగీకరించారు. విద్యార్థులు హోంవర్క్ చేయకపోవడంతో మందలించానని, డ్రైవర్‌ను పిలిపించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నానని తెలిపారు. కానీ డ్రైవర్ బాలుడిని కిటికీకి కట్టేసి అసభ్యంగా ప్రవర్తించిన విషయం తనకు తెలియదని, ఆగస్టు 30న అతన్ని ఉద్యోగం నుంచి తొలగించానని పేర్కొన్నారు.

ఇక స్థానిక తల్లిదండ్రులు మాత్రం ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమె తరచూ విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతూ, తరగతి గది మరియు టాయిలెట్లను శుభ్రం చేయమని బలవంతం చేసేదని చెప్పారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img