epaper
Wednesday, January 28, 2026
epaper

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్

అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్
రూ.160 కోట్ల పెట్టుబ‌డి.. 100 కిలోల ఉత్ప‌త్తి సామర్థ్యం
దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులకు బాట
31న ఏఈసీ ఛైర్మన్ అజిత్‌కుమార్ మొహంతి చేతుల మీదుగా ప్రారంభం

కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రం మరో కీలక జాతీయ ప్రాజెక్ట్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటికే ఉన్న భారజల ప్లాంట్‌కు అనుబంధంగా ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమైంది. సుమారు రూ.160 కోట్ల వ్యయంతో, 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. జనవరి 31న అజిత్‌కుమార్ మొహంతి, భారత అణుశక్తి కమిషన్ (ఏఈసీ) ఛైర్మన్ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్–18 దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే అవకాశం కూడా కల్పించనుంది. వైద్య, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో ఆక్సిజన్–18కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మెగా ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. అశ్వాపురంలో ఆక్సిజన్–18 ఉత్పత్తి ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే 2022లో రూ.50 కోట్ల వ్యయంతో, 10 లీటర్ల సామర్థ్యంతో తొలి ఆక్సిజన్–18 ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతోంది. ఆ ప్రాజెక్ట్‌తో అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్, రష్యాల సరసన భారత్ ఆక్సిజన్–18 ఉత్పత్తి చేసే ఆరో దేశంగా నిలిచింది. ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు భారీ స్థాయిలో కొత్త ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు.

క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర

ఆక్సిజన్ ఐసోటోపుల్లో 16, 17, 18 రకాలు ఉండగా, సాధారణ నీటిలో ఆక్సిజన్–18 కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటుంది. ప్రత్యేక సాంకేతిక విధానాలతో దీన్ని 95.5 శాతం స్వచ్ఛత వరకు పెంచుతారు. ఈ ఐసోటోపు క్యాన్సర్‌ను గుర్తించడంలో కీలకమైన ట్రేసర్‌గా పనిచేస్తుంది. అమెరికా, ముంబైలో జరిగిన తాజా పరిశోధనల్లో క్యాన్సర్ చికిత్సలో దీని ప్రాధాన్యత స్పష్టమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక గ్రాము ఆక్సిజన్–18 ధర రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అశ్వాపురంలో 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో దేశీయ అవసరాలు తీరడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఏజెన్సీ ప్రాంతంలో ఈ మెగా ప్రాజెక్ట్ స్థాపనతో అశ్వాపురం అణుశక్తి, వైద్య పరిశోధనల కేంద్రంగా మరింత గుర్తింపు పొందనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!

విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు! మంత్రి అండతో ప్రజాక్షేత్రంలోకి మహేష్ కుటుంబం ఏదులాపురంలో 2వ...

ఐదు రోజుల బ్యాంకింగ్‌కు డిమాండ్

ఐదు రోజుల బ్యాంకింగ్‌కు డిమాండ్ కొత్తగూడెంలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ పని భారం...

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఏడుగురు జూదగాళ్లు అరెస్టు...రూ.3,490 నగదు స్వాధీనం కాకతీయ, మణుగూరు...

స్థానిక సమరానికి మేం సిద్ధం

స్థానిక సమరానికి మేం సిద్ధం బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం కార్పొరేషన్–మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో...

స్వేచ్ఛయుత ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు

స్వేచ్ఛయుత ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు మునిసిపల్ పోరుకు పూర్తి స‌న్న‌ద్ధ‌త జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు...

బీజేపీకి కార్తీక్‌ గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిక‌

బీజేపీకి కార్తీక్‌ గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిక‌ గంగుల సమక్షంలో అధికారిక చేరిక 21వ డివిజన్...

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది

టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది అక్రిడిటేషన్ జీవో సవరణపై జర్నలిస్టుల్లో హర్షం డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేష‌న్‌...

అల్లం రవికుమార్ కి నంది అవార్డు

అల్లం రవికుమార్ కి నంది అవార్డు కాకతీయ , కూసుమంచి : కూసుమంచి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img