విశిష్ట సేవలు చిరస్మరణీయం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్గా దీర్ఘకాలం విశిష్ట సేవలు అందించిన అంకుబాబు పదవీవిరమణ పొందిన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంకుబాబు సేవా కాలమంతా కర్తవ్యనిబద్ధత, నిష్పాక్షికత, నిజాయితీతో విధులు నిర్వహించి మండల పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, కార్యాలయ వ్యవహారాల్లో పారదర్శకత పాటించడం వంటి అంశాల్లో ఆయన చూపిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు. మండల అభివృద్ధికి ఆయన సేవలు ఎంతో దోహదపడ్డాయని, యువ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్, గట్టుమల్ల సర్పంచ్ బట్టు కనకరాజు, దూదియా తండా సర్పంచ్ బానోత్ రమేష్, హర్యతండా సర్పంచ్ బుజ్జి బాలాజీ, బాబుజి తండా సర్పంచ్ వంకుదొత్ హథీరాం, మండల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొని అంకుబాబును సన్మానించారు.


