epaper
Thursday, January 15, 2026
epaper

సంపన్నులతో సామాన్యులు ఢీ !

సంపన్నులతో సామాన్యులు ఢీ !

రూ.5వేలలోపే ప‌లువురి బ్యాంకు బ్యాలెన్స్

బిహార్​ ఎన్నికల్లో అత్యంత పేద అభ్యర్థుల పోటీ

ఆస‌క్తిరేపుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు

నవంబరు 6న తొలి విడత పోలింగ్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతల్లో అత్యధికులు కోటీశ్వరులే. అయితే కొందరు సామాన్యులు సాహసం చేసి వీరితో తలపడుతున్నారు. స్థిర, చరాస్తులేవీ లేకున్నా, బలం, బలగం కలిగిన దిగ్గజ నేతలను ఢీకొంటున్నారు. కేవలం రూ.1,000, రూ.2,000, రూ.5,000 బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు అభ్యర్థులు నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

సామాన్యుల ఆత్మస్థైర్యం

అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి రూ.10వేలను డిపాజిట్ చేయాలి. ఎస్‌‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.5వేలను డిపాజిట్ చేసి నామినేషన్ వేయాలి. ఇంతకంటే తక్కువ రేంజులో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు వ్యక్తులు ఆత్మస్థైర్యంతో నామినేషన్లు వేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. వారంతా మేం సైతం ఎన్నికల ప్రచార బరిలోనూ దూసుకెళ్తున్నారు. తమతమ స్థాయిల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అభ్యర్థుల సగటు ఆస్తి విలువ : రూ.3.26 కోట్లు

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బిహార్ ఎలక్షన్ వాచ్ కీలకమైన సమాచారంతో తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. దాని ప్రకారం, నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1,303 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.3.26 కోట్లు.

ముజాహిద్ ఆలం : ఆస్తుల విలువ రూ.1000

బిహార్‌లోని దర్భంగ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి మహ్మద్ ముజాహిద్ ఆలం పోటీ చేస్తున్నారు. ఆయన ఎస్‌యూసీఐ (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అత్యంత పేద అభ్యర్థి ఆయనే. ముజాహిద్ ఆలం చరాస్తుల విలువ వెయ్యి రూపాయలే అని ఎన్నికల అఫిడవిట్‌లో ఉంది. గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన ముజాహిద్ ఆలం, ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు.

శత్రుఘ్న వర్మ ఆస్తుల విలువ రూ.1000

పట్నాలోని బార్ అసెంబ్లీ స్థానం నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శత్రుఘ్న వర్మ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కూడా వెయ్యి రూపాయలే. ముజఫర్‌పూర్‌ జిల్లాలోని మినాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి శివ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.2,023. అరా అసెంబ్లీ స్థానం నుంచి విపక్ష మహా ఘట్బంధన్ కూటమిలోని సీపీఐ-ఎంఎల్ పార్టీ తరఫున కయాముద్దీన్ అన్సారీ పోటీ చేస్తున్నారు. ఆయన వద్ద రూ.20వేల నగదు, రూ.5వేల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img