epaper
Sunday, March 1, 2026
epaper

సంపన్నులతో సామాన్యులు ఢీ !

సంపన్నులతో సామాన్యులు ఢీ !

రూ.5వేలలోపే ప‌లువురి బ్యాంకు బ్యాలెన్స్

బిహార్​ ఎన్నికల్లో అత్యంత పేద అభ్యర్థుల పోటీ

ఆస‌క్తిరేపుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు

నవంబరు 6న తొలి విడత పోలింగ్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నేతల్లో అత్యధికులు కోటీశ్వరులే. అయితే కొందరు సామాన్యులు సాహసం చేసి వీరితో తలపడుతున్నారు. స్థిర, చరాస్తులేవీ లేకున్నా, బలం, బలగం కలిగిన దిగ్గజ నేతలను ఢీకొంటున్నారు. కేవలం రూ.1,000, రూ.2,000, రూ.5,000 బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు అభ్యర్థులు నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

సామాన్యుల ఆత్మస్థైర్యం

అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి రూ.10వేలను డిపాజిట్ చేయాలి. ఎస్‌‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.5వేలను డిపాజిట్ చేసి నామినేషన్ వేయాలి. ఇంతకంటే తక్కువ రేంజులో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన పలువురు వ్యక్తులు ఆత్మస్థైర్యంతో నామినేషన్లు వేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. వారంతా మేం సైతం ఎన్నికల ప్రచార బరిలోనూ దూసుకెళ్తున్నారు. తమతమ స్థాయిల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అభ్యర్థుల సగటు ఆస్తి విలువ : రూ.3.26 కోట్లు

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బిహార్ ఎలక్షన్ వాచ్ కీలకమైన సమాచారంతో తాజాగా ఓ సంయుక్త నివేదికను విడుదల చేశాయి. దాని ప్రకారం, నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1,303 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.3.26 కోట్లు.

ముజాహిద్ ఆలం : ఆస్తుల విలువ రూ.1000

బిహార్‌లోని దర్భంగ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి మహ్మద్ ముజాహిద్ ఆలం పోటీ చేస్తున్నారు. ఆయన ఎస్‌యూసీఐ (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అత్యంత పేద అభ్యర్థి ఆయనే. ముజాహిద్ ఆలం చరాస్తుల విలువ వెయ్యి రూపాయలే అని ఎన్నికల అఫిడవిట్‌లో ఉంది. గణిత శాస్త్ర గ్రాడ్యుయేట్ అయిన ముజాహిద్ ఆలం, ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు.

శత్రుఘ్న వర్మ ఆస్తుల విలువ రూ.1000

పట్నాలోని బార్ అసెంబ్లీ స్థానం నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శత్రుఘ్న వర్మ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కూడా వెయ్యి రూపాయలే. ముజఫర్‌పూర్‌ జిల్లాలోని మినాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి శివ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.2,023. అరా అసెంబ్లీ స్థానం నుంచి విపక్ష మహా ఘట్బంధన్ కూటమిలోని సీపీఐ-ఎంఎల్ పార్టీ తరఫున కయాముద్దీన్ అన్సారీ పోటీ చేస్తున్నారు. ఆయన వద్ద రూ.20వేల నగదు, రూ.5వేల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img