epaper
Wednesday, November 19, 2025
epaper

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం
మాజీ మేయ‌ర్ సర్ధార్ రవీందర్ సింగ్
మహాత్మా జ్యోతిబాపులే పార్క్‌ భూమి విద్యుత్ శాఖకు కేటాయింపుపై ఆగ్ర‌హం

కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తూ నగర అభివృద్ధికి చేపట్టిన పనులను ఇప్పుడు అధికారులు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గతంలో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబాపులే పార్క్‌ను ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ బోర్డుకు అప్పగించామని, కానీ ఇప్పుడు అదే పార్క్‌లోని 4 గుంటల భూమిని విద్యుత్ శాఖకు కేటాయించడం నగర అభివృద్ధి ఆత్మను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండానే పార్క్ భూమిని మరో శాఖకు కేటాయించడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన అని అన్నారు. చట్టంలో ఎక్కడా కూడా పార్క్‌లలోని భూములను ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదని, స్మార్ట్ సిటీ కింద ఉన్న భూములను కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. పార్క్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని పలు పార్క్ స్థలాలను కమ్యూనిటీ హాళ్లు, యూత్ క్లబ్బులుగా మార్చడం కూడా అదే ధోరణిలో జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కౌన్సిల్ లేకుండా, ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయల చొప్పున వసూలు చేయడం ప్రజలపై భారీ భారం మోపటమేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్లు ఉండగా నెలకు 60 లక్షలకుపైగా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది ప్రజాపాలన పేరుతో జరుగు ఇష్టానుసార పాలనకే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు పన్నులు చెల్లిస్తుండగా శానిటైజేషన్ పేరుతో మళ్లీ కొత్తగా వసూళ్లు ప్రారంభించడం అర్థరహితమని ప్రశ్నించారు. కాంట్రాక్టు వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ జ్యోతిబాపులే పార్క్ 4 గుంటల భూమిని ఎలా కేటాయించగలిగారు అని ప్రశ్నించిన ఆయన వెంటనే ఆ జీఓను రద్దు చేయాలని, శానిటైజేషన్ పేరుతో జరుగుతున్న వసూళ్లను నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ నగర మేధావులు, బుద్ధిజీవులు కూడా ఈ అంశంపై స్పందించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సింగ‌రేని కార్మికుల‌కిచ్చిన హామీల‌ను నెర‌వేర్చాలి

సింగ‌రేని కార్మికుల‌కిచ్చిన హామీల‌ను నెర‌వేర్చాలి జాగృతి కవిత అరెస్టు అన్యాయం ఖండించిన తెలంగాణ జాగృతి...

వయోవృద్ధుల పోషణ చట్టం కఠినంగా అమలు

కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం...

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి

హుజురాబాద్‌లో బీసీ జేఏసీ సమావేశం కాకతీయ, హుజురాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో...

రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ అబద్ధాల ప్రచారం

రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ అబద్ధాల ప్రచారం నాటి ప‌దేళ్ల పాల‌న‌లో ధాన్యం త‌రుగును...

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ : గ్రామాభివృద్ధి...

హిందుత్వమే నా శ్వాస

హిందుత్వమే నా శ్వాస నా నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు...

రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు సన్మానం

రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు సన్మానం కాకతీయ, నల్లబెల్లి: మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌...

చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్

చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img