epaper
Saturday, November 15, 2025
epaper

రేపే స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌.. ఎన్నికల సంఘం ప్రెస్ మీట్

ఆగేది లేదు..!
స్థానిక ఎన్నిక‌లకు స‌ర్కారు సై
నేడు స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌..?!
ఎస్ఈసీకి రిజ‌ర్వేష‌న్లు, ఓట‌ర్ల జాబితా
ఉద‌యం 11 గంట‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ.. ప్రెస్‌మీట్‌కు స‌న్నాహాలు
ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల నుంచి ఎస్ఈసీకి సంకేతాలు
నోటిఫికేష‌న్ జారీ త‌ర్వాత‌నైనా హైకోర్టులో విచార‌ణ‌ను ఎదుర్కోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం?
ముందుగా పార్టీ గుర్తుపై జ‌రిగే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కే వెళ్లాల‌ని నిర్ణ‌యం
సోమ‌వారం జీపీ ఎన్నిక‌ల షెడ్యూల్ సైతం ప్ర‌క‌టించే అవకాశం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి జాప్యం లేకుండానే ముందుకెళ్లాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌నిపిస్తోంది. శ‌నివారం హైకోర్టు ధ‌ర్మాస‌నం నుంచి ఎదురైనా ప్ర‌శ్న‌ల‌కు నోటిఫికేష‌న్ త‌ర్వాత కూడా విచార‌ణ‌లో బ‌దులివ్వాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఈ మేర‌కు న్యాయ నిపుణుల స‌ల‌హా కూడా తీసుకున్న త‌ర్వాత ముందుకెళ్ల‌డ‌మే స‌రైంద‌ని రేవంత్ స‌ర్కారు భావించిన‌ట్లుగా తెలుస్తోంది. సోమ‌వారం ఉద‌యం పంచాయ‌తీరాజ్‌శాఖ నుంచి రిజ‌ర్వేష‌న్లు,ఓట‌ర్ల జాబితాను ఎస్ ఈసీకి చేర‌నుంద‌ని, ఆ త‌ర్వాత వెంట‌నే ఎస్ఈసీ స్థానిక ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. ఈమేర‌కు ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే జ‌డ్పీచైర్మ‌న్, జ‌డ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, స‌ర్పంచు, వార్డు స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్ల కేటాయింపు ప్ర‌క్రియ‌ను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అలాగే ఎన్నిక‌ల‌ను శాంతియుతంగా నిర్వ‌హించేందుకు ఎక్సైజ్‌, పోలీసు, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర శాఖల అధికారులతో ఎన్నిక‌ల సంఘం అధికారులు స‌మావేశాలు నిర్వ‌హించారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌త‌తో ఉంది. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌డంతో సోమ‌వారం ఉద‌యం స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీకి సిద్ధ‌మైన‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

విచార‌ణ‌ను ఎదుర్కొనేందుక సిద్ధం..!

స్థానిక ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ తీసుకొచ్చిన జీవోకు గెజిట్ లేద‌ని, బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లు గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి పంప‌డం..పెండింగ్‌లో ఉండ‌గా అంత హాడావుడిగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మెందుకంటూ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ వాద‌న‌లు విన్న త‌ర్వాత హైకోర్టు అక్టోబ‌ర్ 8కి విచార‌ణ‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ చేప‌ట్టే వ‌ర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌కుండా ఆగుతారా అంటూ కూడా ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. నోటిఫికేష‌న్ ఇచ్చిన త‌ర్వాత కూడా విచార‌ణ‌ను కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కూడా ఏజీ బ‌దులివ్వ‌డంతో.. ఈ అంశంపై స్టే ఇవ్వ‌కుండానే హైకోర్టు ధ‌ర్మాస‌నం అక్టోబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు విచార‌ణ‌ను వాయిదా వేసింది. నోటిఫికేషన్‌ కంటే ముందే పిటిషన్లు దాఖలైన నేప‌థ్యంలో నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా మెరిట్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్లు రెగ్యులర్‌ రోస్టర్‌ కలిగిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వ‌స్తాయ‌ని కూడా తెలిపింది. ప్రస్తుతానికి ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ పై గానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై గానీ హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదు.

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై పిటిష‌న్లు..!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులతో పాటు పంచాయతీరాజ్‌ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంటూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన బి.మాధవరెడ్డి, ఎస్‌.రమేశ్‌ తదితరులు హైకోర్టు శనివారం రెండు హౌజ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే జీవోకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌ని, గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద బిల్లు పెండింగ్‌లో ఉండ‌గా జీవో ఎలా జారీ చేస్తారంటూ అటార్నీ జ‌న‌ర‌ల్‌ను ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు..? 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా..? అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టులో మరోసారి సవాల్‌ చేశారు రెడ్డి జాగృతి మాధవరెడ్డి. జీవోను రద్దు చేయాల్సిందేనంటూ ఆయన తరుపు లాయర్ వాదనలు వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులనూ హైకోర్టులో ప్రస్తావించారు.

ముందండుగేకు స‌న్న‌ద్ధం..!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో వెన‌క్కి త‌గ్గొద్ద‌న్న ఆలోచ‌న‌తో ఉన్న రేవంత్ స‌ర్కారు..న్యాయ‌పర‌మైన చిక్కులేమైనా ఎదురుతాయా అన్న స‌మాలోచ‌న‌లు చేస్తోంది. వాస్త‌వానికి ఆదివారం సాయంత్రం నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంద‌న్న ఊహాగానాలు వినిపంచినా.. దీనిపై ఒక‌ట్రెండు రోజులు ఆగుదామా..? ఆలోచ‌న‌లు చేసినా చివ‌రికి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం. గవర్నర్‌ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాద‌ని కూడా హైకోర్టు సూచిచింది. అవసరమైతే మరో 2, 3నెలల సమయం కోరుతూ అఫిడవిట్‌ వేసుకోవాలని సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ… ప్రభుత్వ నిర్ణయానికి రెండ్రోజుల సమయం కావాలని కోరింది. అలాగే నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడ‌గ‌గా… ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ఇస్తామని ఎన్నిక‌ల సంఘం త‌రుపు న్యాయ‌వాది బ‌దులిచ్చారు. దీంతో ప్ర‌భుత్వ ఉద్దేశంలో మాత్రం ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే బ‌ల‌మైన ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img