epaper
Saturday, November 15, 2025
epaper

అక్ర‌మం.. అబ‌ద్ద‌మ‌ట‌..!!.. మ‌ల్లంప‌ల్లి క్వారీలో అస‌లేం జ‌ర‌గ‌లేదంట‌

అక్ర‌మం.. అబ‌ద్ద‌మ‌ట‌..!!
మ‌ల్లంప‌ల్లి క్వారీలో అస‌లేం జ‌ర‌గ‌లేదంట‌
ములుగు జిల్లా మైనింగ్ అధికారుల‌కు క‌న‌బ‌డ‌ని సాక్ష్యాలు
మ‌ల్లంప‌ల్లి మ‌ట్టి దందాపై మైనింగ్ ఏడీ పొంత‌న లేని వివ‌ర‌ణ‌
బాధ్య‌తారాహిత్యంగా రిజాయిండ‌ర్ విడుద‌ల‌పై విమ‌ర్శ‌లు
వాస్త‌వాల‌ను బ‌య‌ట పెడితే..అస‌త్య‌మంట‌రా..? అంటూ జ‌నం నుంచి విమ‌ర్శ‌లు
సాక్ష్యాల‌తో స‌హా ప్ర‌చురించినా అర్థం చేసుకోక‌పోవ‌డం ఎవ‌రి పొర‌పాటు..?
చిత్ర విచిత్రాల‌తో నిజాన్ని అబ‌ద్దం చేసే ప్ర‌య‌త్నం కాదా..?
అనుమానాలు క‌లిగిస్తున్న అధికారుల వైఖ‌రి

ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేని మల్లంపల్లి–శ్రీనగర్ శివారులో ఉన్న మాధురి మైన్స్ ప్రాంతంలో ఇటీవ‌ల ఎక్స్‌క‌వేట‌ర్‌తో తవ్వకాలు జరుపుతున్న దృశ్యం

కాకతీయ, ములుగు ప్రతినిధి : అక్ర‌మాన్ని అడ్డుకోలేని అధికారుల త‌త్వం.మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ప‌క్కా స‌మాచారం, ఫొటోల‌తో స‌హా అక్ష‌ర స‌త్యాన్ని అధికారుల‌కు క‌ళ్ల‌కు క‌డితే… అబ్బే అక్క‌డే ఏం త‌వ్వ‌కాలు జ‌ర‌గలేదంటూ వివ‌ర‌ణ ఇవ్వ‌డం వారి వైఖ‌రిపై అనుమానాలు క‌లిగిస్తోంది. ములుగు జిల్లా మ‌ల్లంప‌ల్లి ప్రాంతంలో జరుగుతున్న మట్టిదోపిడీపై కాక‌తీయ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం తెలిసిందే. మూత ప‌డినా క్వారీ నుంచి, అనుమతుల గ‌డువు ముగిసిన క్వారీల నుంచి మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంటూ క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. ఈ విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టే విధంగా ఫొటోల‌ను కూడా క‌థ‌నాల‌కు జ‌త చేసింది.6న కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన “మల్లంపల్లి అడ్డాగా మట్టిదోపిడి” కథనానికి గనులు మరియు భూగర్భశాఖ అధికారులు స్పందిస్తూ ఆ వార్త పూర్తిగా నిరాధారమని, సత్యానికి దూరమని పేర్కొంటూ రిజాయిండర్‌ విడుదల చేశారు. అయితే ఆ వివరణపై స్థానికులు, పత్రిక ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వాస్త‌వ ప‌రిస్థితికి భిన్నంగా.. పొంత‌న లేకుండా అధికారుల స్పంద‌న ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే అధికారుల వివ‌ర‌ణ కూడా ప్ర‌య‌త్నం చేయ‌గా.. నాడు స్పందించని అధికారులు.. మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్న‌తాధికారుల వివ‌ర‌ణ‌ల‌తో ఇప్పుడు క‌దిలారు.

మాధురి మైన్స్ క్వారీలో ఎలాంటి త‌వ్వ‌కాలు లేవ‌ని అధికారులు విడుద‌ల చేసిన ఫొటో… ఈ ఫొటోలోనే త‌వ్వ‌కాలు జ‌రిగిన‌ట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా.. అధికారులు ఏం జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌డం విశేషం.

అబ్బే.. అలాంటి త‌వ్వ‌కాలేం లేవు అక్క‌డ‌…

మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకతీయ ప్రతినిధి చేసిన స్థల పరిశీలన మట్టి తవ్వకాలను గట్టిగా చెబుతోంది. మల్లంపల్లి–శ్రీనగర్ శివారులో ఉన్న మాధురి మైన్స్ పేరుపై గతంలో తవ్వకాలు జరిగిన క్వారీకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో సంవత్సరం క్రితం తాత్కాలికంగా మూసివేయబడింది. కానీ గత వారం రోజులుగా అదే ప్రదేశంలో భారీ ఎస్కవేటర్‌తో తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. పత్రిక ప్రతినిధి ప్రత్యక్షంగా స్థలానికి వెళ్లి పరిశీలించగా, తాజాగా తవ్విన మట్టిపొరలు, భారీ యంత్రాల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. తనిఖీలలో పాల్గొన్న మైనింగ్ శాఖ ఆర్‌ఐ సిబ్బంది తీసిన ఫోటోలలో కూడా యంత్రాల ట్రాక్ గుర్తులు, మట్టిపొరల తవ్వకాలు స్పష్టంగా కనిపిస్తున్నా, శాఖ అధికారిక నివేదికలో మాత్రం “ఏమీ లభించలేదు” అని పేర్కొనడం అనుమానాస్పదమని పత్రిక ప్రశ్నించింది.

ఆధారాలతో నిరూపించేందుకు కాక‌తీయ‌ సిద్ధం

మూత‌ప‌డిన క్వారీ నుంచి అక్ర‌మంగా త‌వ్వ‌కాలు జ‌రుగిన‌ట్లుగా కాక‌తీయ వ‌ద్ద పూర్తి స్ప‌ష్ట‌మైన‌,నిర్దిష్ఠ‌మైన ఆధారాలున్నాయి. దీన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉంది. తవ్వకాలు జరిగిన ఖచ్చితమైన స్థలం 18°07’07.4″N 79°52’53.2″E వద్ద ఉందని, ఆ ప్రదేశంలో ఇటీవలే తవ్వకాలు జరిగాయని స్పష్టమైన ఆధారాలతో నిరూపించగలమని ప్రకటిస్తున్నాం. ప్రజల సొత్తు రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలవంచారా? లేక అక్రమార్కులతో కుమ్మక్కై మౌనంగా ఉంటున్నారా? అనే అనుమానాలు జ‌నం నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స్థానిక గ్రామస్తులు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ ఇటీవలి కాలంలో రాత్రిపూట లారీలు తిరుగుతున్నాయి, పెద్ద యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మన కళ్లముందే జరుగుతుంటే అధికారులు గుర్తించలేదంటుండ‌టం న‌వ్వులాట‌గా అనిపిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img