జిల్లాలో కాదు… రాష్ట్ర కార్పొరేషన్ లో పదవి కేటాయించాలి
నెల్లికుదురు మాజీ జెడ్పిటిసి డిసిసి అధ్యక్షురాలికి వినతి
కాకతీయ, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్, నెల్లికుదురు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ గురువారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ని కలిసి వినతి పత్రాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డితో కలిసి అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఉపాధ్యక్ష పదవిలో మాజీ జెడ్పిటిసి ని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అతనికి కేటాయించిన స్థానంలో మరి ఎవరినైనా లేక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదన తుర్తి మాజీ సర్పంచ్ వలభోజు వెంకటేశ్వర్లు నైన ఉపాధ్యక్ష పదవిలో నియమించాలని అదేవిధంగా మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర ని రాష్ట్రంలో ఏదైనా కార్పొరేషన్కు చైర్మన్గా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ లకి సిఫారసు చేయాలని కోరుతూ డిసిసి అధ్యక్షురాలు కి వినతి అందజేశామని తెలిపారు. మండలానికి సంబంధించిన దాదాపుగా 200 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు నెల్లికుదురు నుండి బయలుదేరి వారిని కలసి వినతి పత్రం అందజేశామని మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షులు యాదవ రెడ్డి, మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు గుట్టయ్య గౌడ్, జిల్లా నాయకులు తోట వెంకన్న, సర్పంచ్ పులి వెంకన్న, గ్రామ అధ్యక్షులు రత్నపురం యాకయ్య,బండారు మల్లయ్య, గడ్డం అరుణ్ కుమార్ వ్యాసం యకయ్య, వెంకటేష్, అనిల్, కృష్ణ, పల్లె యాకయ్య, ఓబిసి నాయకులు ఆకుల నరసయ్య, రవి, మల్లేష్ సట్ల యాకయ్య, కిషన్ నాయక్, జాదు నాయక్, చంద్రు నాయక్,ఆకుల నాగయ్య ,సుందర్ నాయక్, పూర్ణచందర్, కిషన్ రావు, పులిచిన్నరసయ్య, నాయిని శ్రీపారు రెడ్డి, ఆకుతోట సతీష్, మౌనేందర్, క్రాంతి, రాజేష్, పులి శ్రీను, బండి యాకయ్య, సమ్మయ్య, నరసయ్య, రమాదేవి, కొమురయ్య,అశోక్, వీరన్న ఆకుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


