epaper
Tuesday, March 31, 2026
epaper

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..!

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..!
లాభాల కోసం ప్రాణాల పణంగా పెడుతున్నారంటూ విమ‌ర్శ‌
దుర్గా యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికుడి మృతి చెందాడు
మ‌ణుగూరు ఓసీ-2లో ఘ‌ట‌న‌పై సీఐటీయూ ఘాటు స్పంద‌న‌
యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంతోనే కార్మికుడు చ‌నిపోయాడంటూ విమ‌ర్శ‌లు
హత్యగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్‌
మైన్స్ ఏరియాలో కార్మిక చ‌ట్టాలు అమ‌లు చేయ‌డం లేద‌ని మండిపాటు

కాకతీయ, మణుగూరు : మ‌ణుగూరు సింగరేణి ఓసి-2లో జ‌రిగిన ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇది ప్రమాదం కాదని, దుర్గా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ఆరోపించారు. బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.గాయపడిన కార్మికులను సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కే బ్రహ్మచారి, కోశాధికారి పద్మ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి భూక్యా రమేష్, మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి గద్దల శ్రీనివాసరావులతో కలిసి బి మధు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో మరో ముగ్గురు కార్మికులు గాయపడి చికిత్స పొందుతున్నారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సంఘాల నాయకులు పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల సమయంలో పాటించాల్సిన కనీస రక్షణ సూత్రాలు కూడా అమలు కాలేదని బి మధు పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు వినియోగించడం, విధి ప్రకారం పాటించాల్సిన నిబంధనలను విస్మరించడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. టైర్ పనుల్లో మిషన్ వినియోగించాల్సిన చోట చేతిపనితో నిర్వహించడం, చైన్ బిగించకుండా పని చేయించడం వంటి నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీశాయని అన్నారు. మైన్స్ చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన రక్షణ కమిటీలు కూడా నామమాత్రంగా ఉన్నాయని విమర్శించారు. రక్షణపై శ్రద్ధ లేకపోవడం వల్లే కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

చట్టాలు అమలు లేకపోవడంపై విమర్శలు

అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తున్నదని మ‌ధు ఆరోపించారు. కార్మికుల వివరాలు నమోదు చేయకపోవడం, అవసరమైన అనుమతులు తీసుకోకపోవడం జరుగుతోందన్నారు. వేతనాలను బ్యాంక్ ద్వారా చెల్లించకపోవడం వల్ల కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం కూడా దక్కడం లేదని చెప్పారు. చట్ట ప్రకారం రికార్డులు నిర్వహించకపోవడం, రక్షణ సూత్రాలన్నింటినీ విస్మరించడం వల్ల కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇకనుంచి రక్షణ సూత్రాలను కఠినంగా అమలు చేయాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని, సింగరేణి యాజమాన్యం పర్యవేక్షణ పెంచాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి

నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో...

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు

గిరిజన గర్భిణీలకు మెరుగైన మాతృసేవలు టిఫ్ఫా స్కాన్ సేవలు అందుబాటులోకి డీసీహెచ్ ఎస్ డాక్టర్...

ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రదానం

ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రదానం కాకతీయ,ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో...

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి

ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు కాకతీయ, మధిర...

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు? ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలి వెన్నెల నగర్‌లో నీటి...

సీడ్ కంపెనీ మోసం

సీడ్ కంపెనీ మోసం ఆశ చూపించి విత్తనాలు విక్ర‌యం కొనుగోలు స‌మ‌యంలో చేతులెత్తేసిన ఆర్గ‌నైజ‌ర్లు క్వింటాకు...

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి

మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి అమృత్ నిధులతో...

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి

ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు సాగాలి టీ టీడీపీ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు ఖమ్మంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img