నూతన ఎంపీడీవో గా కావ్య శ్రీనివాసన్ బాధ్యతలు
కాకతీయ, నర్మెట్ట: మండల కేంద్రం లో ని నూతన ఎంపీడీవో గా కావ్య శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–1లో ప్రతిభతో ఎంపికై 7 రోజుల గవర్నమెంట్ ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం, ప్రభుత్వం తాజాగా మండలాల వారీగా పోస్టింగ్లు జారీ చేస్తూ నర్మెట్టకు ఆమెను నియమించింది. ఉత్సాహం, నిబద్ధత, సేవా భావంతో కూడిన కావ్య శ్రీనివాసన్ సోమవారం అధికారికంగా పదవిలో చేరి, మండల కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గ్రామీణ ప్రగతి, ప్రజల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె స్పష్టం చేశారు


