epaper
Thursday, March 5, 2026
epaper

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను
రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్ అంకిత్
మణుగూరులో ప్రభుత్వ సంస్థల్లో సుడిగాలి తనిఖీలు
ఆసుపత్రి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన

కాకతీయ, కొత్తగూడెం : విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన పలు ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల, గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ముందుగా మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వార్డులు, ఔషధ నిల్వ గది, ఔట్‌పేషంట్ విభాగం, మందుల సరఫరా విధానం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.

పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నారు. గత సంవత్సరం ఫలితాలను పరిశీలించి ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గిరి యూనిట్ ద్వారా సరఫరా అవుతున్న చిక్కీలను, విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారికి నాణ్యమైన ఆహారం అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, హాజరు వివరాలు, వంటగది, నిల్వ గది, త్రాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం పోషకాహారం సమయానికి అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, వైద్యులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస కాంగ్రెస్ పార్టీలో...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల...

రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రేషన్ డీలర్‌పై కేసు నమోదు తనిఖీలో 60 క్వింటాళ్లకు పైగా నిల్వ తేడా...

మార్చి 16న చలో కలెక్టరేట్

మార్చి 16న చలో కలెక్టరేట్ లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి కార్మికుల...

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు రెండు లక్షల జరిమానా...

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు...

గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి

గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై...

ఇరాన్‌పై దాడుల‌ను ఆపాలి

ఇరాన్‌పై దాడుల‌ను ఆపాలి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర‌స‌న‌ ఖ‌మ్మంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img