రోడ్డు పనుల నిర్లక్ష్యం… వరద ముంపులో రైతుల పొలాలు.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ శివారులోని జాతీయ రహదారి (ఎన్ హెచ్) బైపాస్ రోడ్డు పనుల వల్ల పంట పొలాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. డిబీ యల్ కంపెనీ చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం కారణంగా వర్షపు నీరు పొలాల్లోకి చేరుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవడంతో మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినా అమలు కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వరద నీటితో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


