epaper
Sunday, January 25, 2026
epaper

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం
బీఎల్ఓల ముగ్గులు, విద్యార్థుల పోటీలు ఆకర్షణ

కాకతీయ, కొత్తగూడెం : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఐడీఓసీ ప్రాంగణంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) నిర్వహించిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన ముగ్గులు అందరి మన్ననలు పొందాయన్నారు.

విద్యార్థులకు ప్రశంసలు, సన్మానాలు

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. చిన్న వయసులోనే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరని ఆయన అన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న బూత్ లెవల్ అధికారులకు అవసరమైన కిట్లను కలెక్టర్ అందజేశారు.

ఉత్తమ అధికారులకు ఘన సత్కారం

ఎన్నికల విధుల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఎలక్టోరల్ అధికారులుగా ఎంపికైన తాసిల్దార్లు, జిల్లా మాస్టర్ ట్రైనర్‌లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యమేనని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

ఓటు హక్కుపై ప్రతిజ్ఞ

ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, విద్యార్థులు, నూతన ఓటర్లు సహా అందరితో ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహనను మరింత పెంచాయని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, తాసిల్దార్లు పుల్లయ్య, ధార ప్రసాద్, జిల్లా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు, నూతన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు...

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి! విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి ఖమ్మంలో కాంగ్రెస్...

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి కేంద్ర...

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం మున్సిపల్...

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్...

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి గెలుపే లక్ష్యంగా...

మధిరలో సీఎం కప్ పోటీలు

మధిరలో సీఎం కప్ పోటీలు గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు ఒలింపిక్ స్థాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img