epaper
Thursday, January 15, 2026
epaper

పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాకతీయ, పరకాల/గీసుగొండ :

పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి నియోజకవర్గంలోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాలలో పర్యటన చేసి పలు గ్రామాలలో అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. గీసుగొండ మండలంలోని గట్టుకిందిపల్లిలో అంగన్వాడి కేంద్రాకి ఎమ్మెల్యే రేవూరి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రామాణిక అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రాథమిక అవసరాలైన రోడ్లు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్తు వంటి రంగాలలో వేగవంతమైన అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని పత్తి వ్యవసాయ క్షేత్రంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియాను పిచికారీ చేసిన విధానాన్ని ఎమ్మెల్యే రేవూరి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కష్టాన్ని తగ్గించుకోవాలని సూచించారు. డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేసుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేసుకోవచ్చని డ్రోన్ల ద్వారా పిచికారి చేయడం వలన పంట అంతటికి ఒకే విధంగా మందు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జడ్పీ సీఈఓ రామిరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఇజ్జగిరి, డిఈ జ్ఞానేశ్వర్ ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పాలనతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామా ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని గ్రామా ప్రజలకు సూచించారు. అనంతరం చౌళ్లపల్లి, అగ్రంపహాడ్ గ్రామాల్లో నూతన అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, బిఆర్ఎస్ హయాంలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఆరు గ్యారంటీల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి నిర్మల, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి తహసీల్దార్ భాస్కరమూర్తి, ఎంపిఓ విమల, ఏఈ బాబురావు, ఎపిఓ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్, ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మాజీ జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, పిఏసియస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img