హత్య…? ఆత్మహత్య….?
మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి
కట్టుకున్నోడే కడతేర్చాడని బంధువుల ఆరోపణ
కలహాలతో ఉరి వేసుకుని మృతి చెందింది.. భర్త ఆరోపణ
మృతురాలి బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాకతీయ ,కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ రైటర్ బస్తి గొల్లగూడెం లో ఉపాధ్యాయులు మృతి చెందిన సంఘటన సోమవారం కొత్తగూడెంలో మిస్టరీగా మారింది. కట్టుకున్నోడే కడతెర్చాడని మృతురాలి బంధువులు ఆరోపణ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని భర్త ఆరోపణ. ఏది ఏమైనా హత్య ఆత్మహత్య అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది .మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జూలూరుపాడు మండలం ఒంటెగుడిసె ప్రాంతానికి చెందిన మాలోతు నాగేశ్వరరావు, సుజాతనగర్ మండలం సీతంపేట బంజరకు చెందిన బుక్స్ కవితకు వివాహం జరిగి సుమారు పది సంవత్సరాలు కావస్తుంది .వీరిద్దరి కలహాలు లేకుండా సంసారం కొన్నేలుగా సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు నాగేశ్వరావు బూర్గంపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మృతి చెందిన కవిత భద్రాచలం జడ్పిహెచ్ఎస్లు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం కవితకు నాగేశ్వరావుకు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో రైటర్ బస్తి గొల్లగూడెం ప్రాంతానికి అంబులెన్స్ రావడంతో స్థానికులు సంఘటన ప్రాంతానికి చేరుకోగానే తన భార్య ఉరి వేసుకుందని అందుకే ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని భర్త నాగేశ్వరరావు తెలిపాడు . కవితను ఆసుపత్రికి తరలించగా అప్పటికే కవిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని కవిత సోదరులైన రవి నరేషులు ఫిర్యాదులు పేర్కొన్నారు ఉరివేసుకొని చనిపోవలసిన తన సోదరి కవితకు లేదని వాదిస్తున్నారు కవిత భర్త నాగేశ్వరావు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అందుకే వారి కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయని బంధువుల ఆరోపిస్తున్నారు.
కావాలనే కవిత భర్త నాగేశ్వరావు ఆమెను కడతేర్చాడని ఆరోపించారు బంధువులు ఆరోపణలు పరిరలోకి తీసుకుంటే అనేక ప్రశ్నలు ఉత్పనమవుతున్నాయి ఒకవేళ కవిత ఉరివేసుకొని మృతి చెంది ఉంటే ఆ సమాచారాన్ని కవిత బంధువులకు కుటుంబీకులకు ఎందుకు చెప్పలేదని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని.. కవిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో హుటాహుటిన భర్త నాగేశ్వరావు నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పది సంవత్సరాలపాటు సజావుగా సాగిన వీరి కుటుంబంలో వివాహేతర సంబంధమే కారణమా..?, అందుకు భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే కారణమా..? కవిత భర్త ఆమెను చంపి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నాడా…? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి పోలీసుల విచారణలో ఎలా తేలనోందో వేచి చూడాల్సిందే.


