epaper
Sunday, March 1, 2026
epaper

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌
వ్య‌క్తి గ‌త క‌క్ష‌, భూ వివాద‌మే కారణం
పోలీసుల అదుపులో 6 గురు నిందితులు
వివ‌రాలు వెల్ల‌డించిన క‌రీంన‌గ‌ర్ సీపీ

కాకతీయ,కరీంనగర్ : కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ (40) హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు.
భూమి అమ్మకం కమీషన్ గొడవలు, వ్యక్తిగత విభేదాలు, బెదిరింపులు ఈ దారుణ హత్యకు కారణమయ్యాయని శుక్రవారం సిపి గౌష్ ఆలం మీడియా కు వివరాలు వెల్లడించారు.పథకం ప్రకారం దినేష్‌ను మద్యం పేరుతో బయటకు తీసుకువెళ్లి, దారుణంగా మట్టుబెట్టిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.దేవునూరి సతీష్, దినేష్ మధ్య భూవివాదాలు నెలకొని ఉండగా, మరో నిందితుడు దేవునూరి సంతోష్‌తో సన్నిహిత సంబంధాల విషయంలో దినేష్ పలుమార్లు బెదిరించడంతో కక్షలు పెరిగాయి. ఈ విషయాన్ని సంతోష్ తన అన్న శ్రావణ్‌కు చెప్పగా, ఇద్దరికీ దినేష్‌ వల్ల ముప్పు ఉందన్న భావనతో హత్యకు ప్రణాళిక పన్నాడు.ఫిబ్రవరి 25, 2024న శ్రావణ్ కుటుంబంలో జరిగిన మరణం కారణంగా అక్కడికి వచ్చిన దినేష్‌ను మద్యం పేరుతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఎర్టిగా కారును కిరాయికి తెచ్చి, మద్యం తాగించిన అనంతరం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్‌ను తీసుకొచ్చి నిందితులంతా కలిసి దారుణంగా దాడి చేశారు. తరువాత అతన్ని కారులో ఎక్కించుకొని నూకపల్లి శివారులో ఆపి తాడుతో మెడను బిగించి హత్య చేశారు. తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు.ప్రధాన నిందితులైన దేవునూరి సతీష్, శ్రావణ్ గతంలో గంగాధరలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు చొప్పదండి సిబ్బంది మల్కాపూర్‌లో దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా, హత్యకు ఉపయోగించిన ఎర్టిగా కారు, యమహా బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.ఈ కేసును ఛేదించడంలో చొప్పదండి ఇన్స్పెక్టర్ ప్రదీప్‌కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సైలు నరేష్‌రెడ్డి, వంశీకృష్ణ, రాజు, సాంబమూర్తి సిబ్బంది ఓర్పుతో పని తీరును,సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img