సీతంపేటలో మోటార్ దొంగల బీభత్సం
ఒకే రాత్రి పది మోటార్లు మాయం
కాకతీయ,జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం సీతంపేటలో వ్యవసాయ బావుల వద్ద భారీ దొంగతనం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కాలువపై రైతులు ఏర్పాటు చేసుకున్న పది విద్యుత్ మోటార్లు శుక్రవారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. దొంగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలోనే నిందితులను పట్టుకుని మోటార్లను రికవరీ చేస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. వరుస ఘటనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


