epaper
Thursday, January 15, 2026
epaper

రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు

రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్
వరంగల్‌ రోడ్డు ప్రమాదాల్లో 450 మందికిపైగా మృతులు
సురక్షిత ప్రయాణమే లక్ష్యం కావాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రతి వాహనదారుడు క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడమే మనందరి ప్రధాన లక్ష్యంగా మారాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై, ముఖ్యంగా హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ర్యాలీని ప్రారంభించడంతో పాటు, హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజీఎం, పోచమ్మమైదానంలోని ఎస్‌.ఆర్‌. కళాశాల వరకు కొనసాగింది.

రోడ్డు ప్రమాదాలు జాతీయ సమస్య
అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన సమస్యగా మారాయని, హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గత ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా 450కు పైగా మంది మృత్యువాత పడ్డారని, హెల్మెట్ ధరించని కారణంగా తొమ్మిది లక్షల మందికి పైగా వాహనదారులకు జరిమానాలు విధించామని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాహనదారులు తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.

మద్యం సేవించి డ్రైవింగ్.. ప్రాణాంతకం

మద్యం సేవించి వాహనం నడపడం వలన వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతోందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు అందించవద్దని, కారు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతతో పాటు మత్తుపదార్థాలు, సైబర్ నేరాలు కూడా సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని, వాటి వినియోగం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని హెచ్చరించారు. మత్తుపదార్థాల విక్రయానికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు ప్రకటనలు, ఉచితాలు, ఉద్యోగాలు, లక్కీ డ్రాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలను నమ్మవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలైన ప్రభాకర్ రావు, శ్రీనివాస్, సురేష్ కుమార్, ఏసీపీలైన సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర, నాగయ్య, జాన్ నర్సింహులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాతతో పాటు నగర ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, స్థానిక యువత భారీగా పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img