ప్రియుడితో పోలీస్ స్టేషన్కు మోనాలిసా..!
స్టేషన్కు చేరుకున్న కుంభమేళా బ్యూటీ లవ్ మ్యాటర్
తండ్రి బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణ
రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో ప్రేమ
మేజర్ కావడంతో ఆమె నిర్ణయానికే ప్రాధాన్యమన్న పోలీసులు
త్వరలోనే ప్రియుడితో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం
తిరువనంతపురం : కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో కలిసి కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి తనను బలవంతంగా మరొకరితో పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు రక్షణ కల్పించాలని కోరింది. మోనాలిసా భోస్లే 2024 కుంభమేళా సమయంలో పూసల మాలలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలతో ఒక్కసారిగా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
ఫేస్బుక్లో పరిచయం.. ప్రేమగా మారింది
మోనాలిసా ఉత్తరప్రదేశ్కు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల నిమిత్తం మోనాలిసా కేరళలో ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలోనే బుధవారం ఉదయం ఆమె తన ప్రియుడితో కలిసి తంపనూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తన ఇష్టానికి విరుద్ధంగా మరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిపింది.
పోలీసుల కౌన్సెలింగ్
మోనాలిసా మేజర్ కావడంతో ఆమె తన ఇష్టానుసారం జీవించవచ్చని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోనాలిసా తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. త్వరలోనే వీరిద్దరూ కేరళలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.


