epaper
Sunday, March 1, 2026
epaper

రాజన్న సిరిసిల్లలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా

రాజన్న సిరిసిల్లలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా
పోయిన,దొంగిలించిన 65 ఫోన్లు తిరిగి బాధితుల చెంతకు

కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పోయిన, దొంగిలించబడిన సుమారు రూ.60 లక్షల విలువగల 65 మొబైల్‌ ఫోన్లను జిల్లాలోని పలు ప్రాంతాలు, అలాగే పొరుగు రాష్ట్రాల నుండి గుర్తించి తిరిగి యజమానుల చెంతకు అందజేశారు.అధికారులు మాట్లాడుతూ, నేటి రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ ఒక వ్యక్తిగత సొత్తు మాత్రమే కాకుండా, అతని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డులు వంటి అత్యంత కీలకమైన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుందని చెప్పారు. వీక్‌ పాస్‌వర్డులను పగులగొట్టి దొంగలు ఫోనులో ఉన్న సమాచారాన్ని దుర్వినియోగం చేసి డిజిటల్‌ చెల్లింపు యాప్స్‌ ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.అందువల్ల మొబైల్‌ కోల్పోయిన వ్యక్తులు కేవలం ఒక ఫోన్‌ కాదు, తమ వ్యక్తిగత సమాచారాన్ని, డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరికైనా మొబైల్‌ ఫోన్‌ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్‌ (www.ceir.gov.in) పోర్టల్‌లో తమ ఫోన్‌ నంబర్‌, ఐఎంఈఐ వివరాలను నమోదు చేసి ఫోన్‌ను నిలిపివేయాలని సూచించారు. అనంతరం సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.పాత మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా షాపు యజమాని నుండి రసీదు తీసుకోవాలని అధికారులు సూచించారు. దొంగిలించిన ఫోన్లను తక్కువ ధరలకు విక్రయించే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలియక కొనుగోలు చేసే అమాయకులు మోసాలకు గురవుతున్నారని అన్నారు.
దొంగిలించబడిన ఫోన్‌ అని తెలిసి కొనుగోలు చేస్తే ఆ వ్యక్తిపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటి వరకు సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా 2,183 మొబైల్‌ ఫోన్లను గుర్తించి యజమానులకు అందజేశారు. జిల్లాలో మొబైల్‌ రికవరీ శాతం 83కు చేరడం పోలీసులు సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోన్ల గుర్తింపులో ప్రతిభ ప్రదర్శించిన ఐటీ కోర్‌ బృందంలోని కిరణ్‌కుమార్‌, రాజా తిరుమలేష్‌లను అధికారులు అభినందించారు.మొబైల్‌ దొరకదని భావించిన తమకు తిరిగి ఫోన్‌ అందించడంతో బాధితులు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఐటీ కోర్‌ సిబ్బంది కిరణ్‌కుమార్‌, ఆర్‌.ఐ యాదగిరి, కానిస్టేబుల్‌ రాజా తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img