epaper
Saturday, November 15, 2025
epaper

మ‌హిళా అధికారుల‌కు మంత్రుల‌ వేధింపులు

  • ఇంటికి పిలిపించుకుని అవ‌మానిస్తున్నారు
  • ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి నివేదిక తెప్పించుకోవాలి
  • సంబంధిత మంత్రుల‌ను కేబినేట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
  • రాష్ట్రంలో క్షీణించిన శాంతి భ‌ద్ర‌త‌లు
  • యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపాలి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కాక‌తీయ‌, క‌రీంన‌గర్ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోప‌ణ‌లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పై విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని, బాధ్యులైన మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని మహిళలపై అవమానకరమైన ప్రవర్తన చోటుచేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి నేపథ్యంలో సోమ‌వారం కరీంనగర్ లోని మేరా యువ భారత్ కార్యాలయంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులతో కలిసి బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి చట్టవ్యవస్థను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

యూపీ త‌ర‌హాలో ఉక్కుపాదం మోపాలి

ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు పోలీసులపై దాడులు, హత్యాయత్నాలు చేసే స్థాయికి పెట్రేగి పోతున్నారని నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య, హైదరాబాద్‌లో డీసీపీ చైతన్య పై హత్యాయత్నం జరిగినా ప్రభుత్వం మౌనంగా చూస్తోందని బండి సంజ‌య్ విమ‌ర్శించారు. గో రక్షులపై కూడా దాడులు జరుగుతున్నా పాలకులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఓట్ల కోసం జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిందని విమర్శించారు. యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వంలా రౌడీషీటర్లకు బెయిల్ వచ్చినా బయటకు రానీయకుండా ఉండే విధంగా చట్టాలను కఠినతరం చేయాలన్నారు.

31నుంచి దేశ‌మంతా ఐక్య‌తా మార్చ్‌..!

సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా సర్దార్@150 ఐక్యతా మార్చ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే పాదయాత్రలో తానూ పాల్గొంటునున్న‌ట్లు తెలిపారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక అని ఆయన స్ఫూర్తిని యువతలో నింపడం లక్ష్యమని తెలిపారు. తెలంగాణ విముక్తికి సర్దార్ పటేల్ చేసిన కృషిని గుర్తుచేస్తూ ఆయన లేక పోతే తెలంగాణ నేడు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లా మారిపోయేదన్నారు. ఆయన స్ఫూర్తితో దేశ ఐక్యతను కాపాడుకోవాలని బండి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img