epaper
Thursday, January 15, 2026
epaper

ప్ర‌జ‌ల‌ను మ‌భ్యపెట్టేలా మంత్రి సీత‌క్క హామీలు

ప్ర‌జ‌ల‌ను మ‌భ్యపెట్టేలా మంత్రి సీత‌క్క హామీలు
వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట‌
అసెంబ్లీ ఎన్నిక‌ల హామీలే నెర‌వేర్చ‌లేదు
ములుగులో చెక్కు చెదరని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్
రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్‌రెడ్డి

కాకతీయ,ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అన్ని రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైనా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ చెక్కుచెదరకుండా నిలిచిందని రెడ్కో మాజీ చైర్మన్‌, బీఆర్ఎస్‌ నాయకుడు వై.సతీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడా మాత్రమే ఉండటం బీఆర్ఎస్‌ బలాన్ని స్పష్టంగా చాటుతోందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్‌ వైపే ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థిని బెదిరింపుల ద్వారా సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఉపసర్పంచ్‌ పదవి మాత్రం బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తికే రావడం బీఆర్ఎస్‌ బలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలింగ్‌ జరిగితే బీఆర్ఎస్‌ అభ్యర్థులే గెలుస్తారన్న భయంతో కాంగ్రెస్‌ పార్టీ పలు చోట్ల సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకుందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా మంత్రి సీతక్క గ్రామాల్లో తిరిగి పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారని, లెక్కకు మించి హామీలు ఇచ్చారని విమర్శించారు.

వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట‌

వెయ్యి మంది ఓటర్లు కూడా లేని గ్రామాల్లో 100 నుంచి 200 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. నియోజకవర్గం మొత్తానికి 15 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రచారం చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌ అభ్యర్థులు, నాయకులపై పోలీసుల ద్వారా, కాంగ్రెస్‌ నేతల ద్వారా బెదిరింపులు చేశారని, పథకాల పేరుతో ప్రజలను భయపెట్టడం నెల రోజులుగా కొనసాగిందన్నారు. స్వయంగా మంత్రి సీతక్క అక్కడే ఉండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేశారని ఆరోపణలు గుప్పించారు. అన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ములుగు ప్రజలు బీఆర్ఎస్‌కు అండగా నిలిచారని తెలిపారు. ఏటూరునాగారం వంటి కీలక గ్రామపంచాయతీని బీఆర్ఎస్‌ కైవసం చేసుకుందని పేర్కొన్నారు. రెండు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 42 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 37 వేల ఓట్లు వచ్చాయని, రెండు పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడానే ఉందన్నారు.

ప్ర‌లోభాల‌కు లొంగ‌ని ప్ర‌జ‌లు..!

సీతక్క ఎంత ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరించినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌ వైపే నిలిచారని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో బీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎదురునిలిచి పోరాడిన అభ్యర్థులకు, అండగా నిలిచిన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడులకు ఎవరూ భయపడవద్దని, రాష్ట్ర నాయకత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img