epaper
Thursday, January 15, 2026
epaper

అధికారుల‌కు మంత్రి పొంగులేటి వార్నింగ్‌

అధికారుల‌కు మంత్రి పొంగులేటి వార్నింగ్‌
మేడారం పనుల్లో అలసత్వంపై సీరియ‌స్‌
12వ తేదీకల్లా పనులు పూర్తి చేయాల‌ని ఆదేశం
నిర్ల‌క్ష్యం చేసే వారిపై చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రిక‌

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లలో కనిపిస్తున్న నెమ్మదితనం, నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, శాఖాధికారుల పనితీరుపై మంత్రి ఘాటుగా మండిపడ్డారు. పనులు పూర్తి చేయకుండా కారణాలు చెప్పడం మానేయాలని అధికారులను మంత్రి హెచ్చరించారు. “ఎవరు కాంట్రాక్టర్లు? ఎవరి బాధ్యత? ఎప్పుడు పూర్తి చేస్తారు?” అంటూ ఒక్కొక్కరినీ నిలదీశారు. 12వ తేదీ లోపు అన్ని ప్రధాన పనులు పూర్తి కావాలని స్పష్టం చేస్తూ, ఆలస్యం జరిగితే బాధ్యులపై సస్పెన్షన్, రికవరీతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శాఖల పనితీరుపై అసంతృప్తి
విద్యుత్, ఆర్‌ అండ్‌ బీ, ఐటీడీఏ సహా అన్ని శాఖల పనుల పురోగతిపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మేడారం జాతర చిన్న కార్యక్రమం కాదు… ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించినది” అంటూ అధికారులకు గుర్తు చేశారు. 18వ తేదీ సీఎం పర్యటనకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. 15వ తేదీ నుంచి డెకరేషన్ పనులు ప్రారంభించి జాతర కాలమంతా ప్రాంతం మెరిసేలా చూడాలని ఆదేశించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, తాగునీరు, శానిటేషన్ వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకోసం సుమారు 4,000 మంది శానిటేషన్ సిబ్బందిని రంగంలోకి దించాలన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్‌గా పనిచేయాలని మంత్రి పొంగులేటి సీతక్క కఠిన ఆదేశాలు జారీ చేశారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img