epaper
Saturday, April 11, 2026
epaper

మిస్సింగ్‌ల మిల్స్ కాలనీ

మిస్సింగ్‌ల మిల్స్ కాలనీ
ఖాకీ నిఘా కరువు… కేటుగాళ్ల వీరంగం
గంజాయి మత్తులో ఆక‌తాయిల‌ రౌడీయిజం
పెరుగుతున్న దొంగల స్వైర విహారం
స్టేషన్‌పై పెరుగుతున్న నిఘా భారం.. భద్రత ప్రశ్నార్థకం
సిబ్బంది కొరతతో క్షీణించిన శాంతిభద్రతలు
స్టేష‌న్ పున‌ర్విభ‌జ‌న ఏర్పాటు ఎప్పుడంటూ ప్ర‌జ‌ల డిమాండ్

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ‌రంగ‌ల్ నగరంలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి నేరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గంజాయి మత్తు, బెల్ట్ షాపులు, వరుస దొంగతనాలతో అశాంతికి కేంద్రంగా మారింది. రాత్రి9 త‌ర్వాత న‌గ‌రంలోనే భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఖాకీ నిఘా బలహీనపడడంతో కేటుగాల్లు రెచ్చిపోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఖిలా వరంగల్ పరిధిలోని పడమర కోట చమాన్ వద్ద జరిగిన తాజా ఘటన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థ‌మ‌వుతోంది. మద్యం మత్తులో ఉన్న యువకులు స్వీట్ షాపులోకి చొరబడి యజమానితో ఘర్షణకు దిగారు. దుర్భాషలాడుతూ షాపు సామగ్రిని ధ్వంసం చేశారు. వేయింగ్ మెషిన్ పగలగొట్టి సరుకులను రోడ్డుపై పారేశారు. ఇదొక్క‌టే కాదు మిల్స్ కాలనీ పరిధిలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో గంజాయి మత్తులో యువకులు పరస్పరం బీరు సీసాలతో దాడులు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు క‌లిగించింది. చిన్న కారణాలకే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అల్ల‌రి మూక‌లు, ఆక‌తాయిల స్వైర్య విహారం, గంజాయి సేవ‌నంలో మైమ‌రిచిపోయి దౌర్జ‌న్యాల‌కు దిగుతున్న ఘ‌ట‌న‌లు అనేకం వెలుగులోకి వ‌స్తున్నాయి. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో పోలీసులు విఫ‌ల‌మ‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు వ‌రంగ‌ల్‌లో స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ఖిలా వరంగల్ లోని స్వీట్ షాప్ పై మద్యం మత్తులో యువకుల దాడి

అర్ధరాత్రి మద్యం విక్రయాలు..!

నిబంధనల ప్రకారం రాత్రి సమయంలో మూతపడాల్సిన మద్యం దుకాణాలు, బార్లు ఉర్సు రోడ్డులో అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి. మద్యం మత్తులో యువకులు గుంపులుగా చేరి గల్లీల్లో హడావిడి చేయడం, అసభ్య పదజాలంతో కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారింది. బెల్ట్ షాపులే ఈ నేరాలకు మూలకారణమన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. శివనగర్‌లో బైక్‌ల నుంచి పెట్రోల్ దొంగతనాలు, కరీమాబాద్‌లో కార్ల అద్దాల ధ్వంసం వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాళం వేసిన ఇళ్లను దోపిడీకి దుండ‌గులు ఎంచుకుంటూ దోచుకెళ్తున్నారు. ఇక అధికారంలో ఉన్న వారికి స‌లాం కొట్టాల్సిందేన‌న్న‌ట్లుగా కొంత‌మంది నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. పోలీసు విధుల‌కు ఆటంకంగా మారుతోంది. నేరాల‌కు పాల్ప‌డిన వారిని స్టేష‌న్‌కు తీసుకొచ్చ‌ని వెంట‌నే అధికార పార్టీ నేత‌ల నుంచి ఫోన్లు, పైర‌వీలు, సెటిల్ చేయాల‌ని ఒత్తిళ్లు పెరుగుతుండ‌టంతో… ఖాకీలు సైతం అడ‌క‌త్తెర‌లో పోక చెక్క మాదిరిగా న‌లిగిపోతున్న‌ట్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నెలరోజుల క్రింద మిల్క్ కాలనీ పరిధిలో రోడ్డు మీద బీర్ సీసాలతో యువకుల దాడి

పెరుగుతున్న మిస్సింగ్ కేసులు..!

ఇదే సమయంలో మిల్స్‌కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒకే రోజు ఇద్దరు చిన్నారులు అదృశ్యమ‌వ‌డం భద్రతా వ్యవస్థపై తీవ్ర సందేహాలు రేకెత్తించింది. సుమారు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల సంఖ్యలో జనాభా ఉన్న ఈ పరిధికి ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే ఉండటం ప్రధాన లోపంగా మారింది. మిల్స్ కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిని రెండుగా విభ‌జించి కొత్త స్టేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌లు ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కావ‌డం లేదు. దీంతో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ స్టేష‌న్ అధికారుల‌కు స‌వాల్‌గా మారింది. స‌రిపోను పోలీస్ సిబ్బంది కూడా లేక‌పోవ‌డంతో భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మొత్తంగా మిల్స్ కాలనీ పరిస్థితి నియంత్రణ తప్పే దశకు చేరుకుంది. తక్షణమే అదనపు సిబ్బంది నియామకం, రాత్రి నిఘా బలోపేతం, గంజాయి, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు చేపట్టకపోతే చిన్న ఘటనలు పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని జ‌నాలు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ.. అల్లం బాలకిషోర్ రెడ్డి చేసిన సామాజిక సేవలపై...

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక కాకతీయ, ములుగు...

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్ కాకతీయ, పరకాల : పిడిఎస్ బియ్యాన్ని...

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్...

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు పది లీటర్ల గుడుంబా, సామాగ్రి ధ్వంసం దుగ్గొండి ఎస్సై...

పాపం పండింది

పాపం పండింది భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్ ఆయ‌న‌తో పాటు మ‌రో...

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..!

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..! జీడ‌బ్ల్యూఎంసీ 54వ డివిజ‌న్లో స‌మ‌స్య‌ల తాండ‌వం తాగునీటికి అల్లాడుతున్న ప్ర‌జ‌లు 45రోజులుగా...

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌ 22 మంది లబ్ధిదారులకు రూ. 16...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img