epaper
Friday, January 16, 2026
epaper

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం!
ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు
కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక సౌకర్యాలు
తాగునీరు, మరుగుదొడ్ల కొరతపై భ‌క్తుల ఆగ్రహం
ఇబ్బందుల నడుమ కూడా అమ్మవార్ల దర్శనంతో పరవశం

కాకతీయ, ములుగు ప్రతినిధి : సంక్రాంతి పండుగ ముగియగానే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. సెలవులు ముగిసినప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతమంతా భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం బంగారు బుట్టలను తలపై పెట్టుకొని గద్దల వైపు సాగారు. తమ కోరికలు తీరాలనే ఆకాంక్షతో “కొంగు బంగారం”గా ప్రసిద్ధిగాంచిన వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మలకు వడి బియ్యం, బంగారం, చీరలు, సారెలు, పసుపు–కుంకుమ, కొబ్బరికాయలతో నైవేద్యాలు సమర్పించారు. అమ్మవార్ల కృపతో కుటుంబాలు సుఖశాంతులతో, పిల్లాపాపలు పాడిపంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. మొక్కులు చెల్లించిన అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా కంక వనాల మధ్య ఉన్న పచ్చని ప్రకృతిలో వంటావార్పు చేసుకుంటూ జాతర ఆనందాన్ని ఆస్వాదించారు. చిన్నారులు అడవీ ప్రాంతంలో ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు. పెద్దలు అమ్మవార్ల కథలను, జాతర విశిష్టతను పిల్లలకు వివరిస్తూ సంప్రదాయాన్ని తరతరాలకు అందించారు. ఈ విధంగా మేడారం మహాజాతర ప్రతి కుటుంబానికి మరపురాని అనుభూతిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం విశేషం.

కనిపించని సౌకర్యాలు.. భక్తుల అవస్థలు

భక్తుల రద్దీ పెరిగిన మేరకు సౌకర్యాలు అందకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. జంపన్న వాగు, గద్దల పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు జాతర సమయానికి అందుబాటులోకి రాకుండా తాడులతో కట్టివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరుగుదొడ్లు లేని పరిస్థితుల్లో చాలామంది ఆరుబయటే మలమూత్రాలు చేయాల్సి రావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆపరేటర్ ట్యాప్స్‌లో నీరు లేకపోవడంతో భక్తులు చేతిపంపులపైనే ఆధారపడ్డారు. తెచ్చుకున్న నీటిని పరస్పరం పంచుకుంటూ నీటి ఎద్దడిని తట్టుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పించినప్పటికీ, జాతర సమయంలోనే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని భక్తులు, స్థానికులు విమర్శిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు మరింత సమర్థంగా అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అన్ని ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు అమ్మవార్ల దర్శనంతో పరవశించి, మేడారం మహాజాతరను జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మలుచుకుని ఆనందంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రజల...

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు సంక్రాంతి సందర్భంగా...

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం...

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ ఆర్టీసీ డ్రైవర్ల భుజాలపైనే వేలాది మంది భద్రత ‘ఆరైవ్‌.....

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం దేవుని గుట్టపై భక్తుల సందడి కాకతీయ, నెల్లికుదురు...

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్! సామాన్య భక్తులపై మాత్రం కఠినత్వం వృద్ధులు–వికలాంగుల్ని పట్టించుకోని వైఖరి పోలీస్ కుటుంబాలకు...

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు 15 మంది అరెస్టు… మరో 9 మంది...

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం! కక్షసాధింపు అనడం సిగ్గుచేటు ఇష్టమొచ్చినట్లు జిల్లాల విభజన బీఆర్ఎస్ పాపం వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img