epaper
Thursday, January 15, 2026
epaper

ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక

ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక
చిలకలగుట్ట పవిత్రత కాపాడటం అందరి బాధ్యత
పూజారులు–ఆదివాసీ సంఘాల మ‌ధ్య సమన్వయం అవసరం
జాతర విజయానికి ప్రత్యేక పాలసీ
భక్తుల సౌకర్యాలపైన ప్ర‌భుత్వం దృష్టి
500 మందితో సేవా బృందం ఏర్పాటు : మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని, పూజారులు–ఆదివాసి సంఘాలు–అధికారుల సమన్వయంతోనే జాతరను విజయవంతం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆదివారం తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్‌లో సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసి సంఘాల నాయకులతో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాలతో కలిసి అభిప్రాయాల సేకరణ సమావేశం నిర్వహించారు.

ఆదివాసీల పాత్ర కీలకం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… జాతర నిర్వహణలో పూజారులు, ఆదివాసి సంఘాల సహకారం కీలకమని తెలిపారు. జాతర నిర్వహణపై తమ సూచనలు, అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించాలని సంఘాల నాయకులను కోరారు. సమావేశంలో వివిధ ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ… ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు రాజ్యాంగబద్ధంగా, గిరిజన హక్కులకు అనుగుణంగా కొనసాగేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు సేవలందించేందుకు 500 మంది ఆదివాసీ యువకులతో ప్రత్యేక సేవా బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.

సమన్వయంతో జాతర విజయం
అనంతరం మంత్రి సీతక్క స్పందిస్తూ… పూజారులు, ఆదివాసి సంఘాల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని వారి సమన్వయంతో జాతరను విజయవంతం చేస్తామని తెలిపారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి అనుగుణంగా మేడారం ఆలయ ప్రాంగణం తరతరాలకు గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ వారసులుగా గిరిజనులకు తగిన గుర్తింపు కల్పిస్తామని, ఆదివాసి సంఘాలు తమ సభ్యుల వివరాలను అధికారులకు అందించాలని సూచించారు.

భక్తుల సౌకర్యాలపై దృష్టి

చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకువచ్చే సమయంలో ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వాలంటరీ సేవల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా నిలిపివేస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల దర్శనానికి ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసి సంఘాల నాయకులు, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img