epaper
Saturday, November 15, 2025
epaper

కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన

కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన

బిఆర్ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి

కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం జాతరకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటికీ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 117 కోట్లు మాత్రమే విడుదల చేసింది అని, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం, కొన్ని చోట్ల నత్తనడకన సాగడం వల్ల ఈసారి జాతర సమయానికి సదుపాయాలు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి అని పేర్కొన్నారు. జాతరలో పాల్గొనే లక్షలాది భక్తులకు తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, రోడ్ల విస్తరణ, చెట్లు–నీడ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. పచ్చని మేడారం ఇప్పుడు ఎడారిలా మారిపోయింది అని, చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతిన్నది అని, గ్రామస్తులు తమ ఇంటి ముందు ఉన్న షేడ్లు, పందిళ్లు తొలగించినా రోడ్లు, కల్వర్టులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుడి మూడు ఎకరాల్లో ఉంటే, దాని వెనక 20 ఎకరాలు రైతుల భూములు జప్తు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని, ఇది ఆదివాసీల అస్తిత్వంపై దాడి చేసినట్లే అని, వనదేవతల ఆవరణలో ఉన్న 300 పైగా చెట్లను నరికేయడం పాపం అని, గ్రామ సభ ఏర్పాటు చేయకుండా చెట్లు తుడిచేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు అని నాగజ్యోతి ప్రశ్నించారు. అలాగే ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పబ్లిక్ టాయ్లెట్స్‌ను వాడకం లోకి తీసుకోకపోవడం, పాత ప్రాజెక్టులను వదిలేసి కొత్త మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల పంట పొలాలపై కన్నేయడం దారుణమని ఆమె విమర్శించారు. జాతర సమయంలో ప్రజల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం కమీషన్ల కోసమే పనులను ఆలస్యం చేస్తోంది అని, అధికారులు, కాంట్రాక్టర్లు లాభాల పంటలు కోసుకునేలోపు భక్తులు, స్థానికులు నష్టపోతున్నారు అని బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, రామ సహాయం శ్రీనివాసరెడ్డి, పోగు నాగేష్, చిడం బాబురావు, శ్రీధర్ గొంది, శివరాజ్, సమ్మిరెడ్డి, కొర్నిబెల్లి శేషగిరి, సురేష్, ఇంద్రారెడ్డి, జీడిబాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img